Translate

29, డిసెంబర్ 2020, మంగళవారం

ప్రపంచీకరణ

 💐💐ప్రపంచీకరణ💐💐

-----------------/-/-------------

1విదేశీ వాణిజ్యo అనగానేమి?
 ఒక దేశం మరొక దేశం తో చేసే వ్యాపార లావాదేవీలను విదేశీ వాణిజ్యం అంటారు.

2.బహుళ జాతి సంస్థలు అంటే ఏమిటి ఉదా.లివ్వండీ?

ఒక కంపెనీ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగిస్తూ చౌకగా ఉత్పత్తుల చేపట్టి   నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు ఉదాహరణకు  కోకో కోల , సాంసంగ్,. టాటా మోటార్స్,, ఇన్ఫోసిస్, ర్యాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్.

3.విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి?

విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు (భవనాలు యంత్రాలు భూమి ఇతర పరికరాలపై ) వ్యయాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు.

4.సరళీకృత ఆర్థిక విధానo అంటే ఏమిటి?

వాణిజ్యం పెట్టుబడులకు ఉన్న అవరోధాలను తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు ఈ విధానాన్ని భారతదేశం 1991 నుండి అమలు చేస్తూ వస్తుంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి ఎక్కువగా వచ్చాయి.

5.జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?

బహుళజాతి కంపెనీలు ,స్థానిక కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని చేపడితే అటువంటి కంపెనీలను జాయింట్ వెంచర్లు అంటారు.

6.W.T.O . విస్తరించుము?

ప్రపంచ వాణిజ్య సంస్థ ( world trade organisation. )


7.I.M.F .
అంతర్జాతీయ ద్రవ్య నిధి.

8.ఎస్ ఈ జెడ్ అనగా నేమి?

.స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి.)

9.ప్రపంచీకరణ అనగానేమి?

విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానంవేగంగా పెరిగింది .పెరుగుతున్న ఈ దేశాల సంబంధాన్ని ఇది ప్రపంచీకరణ అంటారు.

10.ప్రపంచీకరణ పై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని వివరించండి?

ప్రపంచీకరణ వల్ల సేవలు ప్రత్యేకించి ఐటీ తో కూడిన సేవలందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
 నిర్వహణ ఖర్చులు తగ్గాయి. పరిపాలనా సంబంధమైన పనులు  ,ఇంజనీరింగ్ పనులు డేటా ఎంట్రీ, జమా ఖర్చులు లెక్కలు, సులభంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేయగలుగుతున్నారు.
వినియోగదారులకు కూడా నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి.
వినియోగదారులకు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు ,కార్మికులపై సాంకేతిక  పరిజ్ఞానం  ప్రభావం ఒకే రకంగా లేదు.

11.ప్రపంచీకరణ ప్రక్రియ లో బహుళ జాతి సంస్థల పాత్ర ఏమిటి?

బహుళజాతి కంపెనీలు నియంత్రణలో పెట్టుబడులు వాణిజ్యం ద్వారా మార్కెట్లు ఉత్పత్తి అనుసంధానం  బహుళజాతి సంస్థల వల్లనే వేగవంతం అయ్యింది. బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే ఎటువంటి వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అమ్మడం జరుగుతూ ఉంది .వివిధ దేశాల మధ్య దూరం తగ్గి అనుసంధానం పెరిగి ఆర్థిక ప్రక్రియ వేగవంతమైంది.
బహుళజాతి సంస్థల వల్లనే పెట్టుబడులు సేవలు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం మధ్య దిగువ తరగతి దేశాలకు సులభంగా అందుబాటులోకి వచ్చింది.

12భారత దేశo పై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి?

ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాల్లో ధనవంతులకు మేలు జరిగింది .
వివిధ వస్తువుల ఉత్పత్తులలో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి .
వినియోగదారులకు కు ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.
బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి .అవి వారికి లాభంగా పరిణమించాయి.
భారతదేశ అతి పెద్ద కంపెనీల మధ్య కూడా పోటీ పెరిగి సాంకేతిక పరిజ్ఞానం ,ఉత్పత్తి పద్ధతు లలో  , ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తున్నారు .
బహుళజాతి సంస్థల వల్ల ప్రత్యేకించి ఐటీ రంగంలో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి.
ప్రపంచీకరణ వల్ల కొన్ని భారతీయ కంపెనీలు కూడా బహుళజాతి సంస్థలు గా మార్పు చెందాయి.

13.బహుళ జాతి భారతీయ కంపెనీలు ఏవి ఉదా. లివ్వండి?

బహుళజాతి భారతీయ కంపెనీలు టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్ సుందరం ఫాస్ట న ర్ ,వంటి కంపెనీలు,.

14.కార్మిక చట్టాల సడలింపు కంపెనీలు కు ఏ విదంగా ఉపయోగ పడుతుంది   వివరించండి?

కార్మిక చట్టాల వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. 
కానీ కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి .కార్మికులను నియామకం చేసుకునేటప్పుడు డు కల్పించాల్సిన వసతులను పూర్తిస్థాయిలో అంద చేయరు ..
కార్మికులకు పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ.
 ఈ సంస్కరణల వల్ల కార్మికులకు నష్టదాయకం.
 కంపెనీలకు లాభదాయకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ.

15.ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల పై ఒకే విదంగా ఉంటుందా?

ప్రపంచీకరణ  ప్రభావం వల్ల అన్ని దేశాల మీద ఒకే విధంగా ఉండదు .సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి పేద మధ్య ఆదాయ దేశాలకు కు ఎగుమతి చేస్తారు. దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలకు లాభాలు వస్తాయి.
పేద , మధ్య ఆదాయ దేశాలు లో లో విదేశీ పెట్టుబడులు వాణిజ్యం పెరుగుతాయి. ప్రపంచమంతా సరిహద్దు లేని విస్తృత వ్యాపార కేంద్రంగా మారిపోతాయి.
 వివిధ దేశాల సంబంధాలు పెరుగుతాయి.
 వివిధ రకాల ఉత్పత్తుల్లో వివిధ రకాల దేశాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి .

16.విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాల పై అవరోధాలు  కల్పించడానికి గలాకారణాలు ఏమిటి? వీటిని ఎందుకు సరళికరించాలనుకుంటుంది?

స్వాతంత్రం తరువాత విదేశీ పెట్టుబడులు వాణిజ్య లపై అవరోధాలు కల్పించడానికి కారణం దేశీయ పరిశ్రమల అభివృద్ధి, విదేశీ పరిశ్రమల పోటీ నుండి రక్షణ కల్పించడం ప్రధాన ధ్యేయం.
అయితే కాలక్రమంలో భారతదేశంలో లో పెట్టు బడులు తగ్గిపోయి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగింది.
 1991 సంవత్సరం భారతదేశం విదేశీ మారక ద్రవ్యం  లోటు ఏర్పడింది.  
దాంతో  విదేశీ పెట్టుబడుల మీద  ఆధార పడవలసి  వచ్చింది.
 కావున  ఆర్థిక  ఆంక్షలు తొలగించి ఆర్థిక వ్యవస్థను సరళీ కరించి విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించారు.

17.ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి వివరించండి?

జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ స్థానంలో 1955 జనవరి 1న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు కాబడింది.
 దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో కలదు .
ప్రస్తుతం ఈ సంస్థలో సభ్య దేశాల సంఖ్య 153.
 ఈ సంస్థ యొక్క ఆశయం వివిధ దేశాల మధ్య వాణిజ్యపరమైన ఆటంకాలను తొలగించి ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం.



18. విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడుల మధ్యగల వ్యత్యాసాలు తెలపండి?

విదేశీ వాణిజ్యం:-
వివిధ   దేశాల మధ్య జరిగే ఎగుమతులు ,దిగుమతులు, అమ్మకాలు ,కొనుగోళ్లను ,విదేశీ వాణిజ్యం అంటారు.
విదేశీ వ్యాపారం లో వస్తువులు సేవలు మార్పిడి చేసుకోవడం జరుగుతుంది.
విదేశీ వాణిజ్యం ని పెంచడానికి తగ్గించటానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాల ను (పన్ను))ఉపయోగించవచ్చు.

విదేశీ పెట్టుబడి. :- వివిధ దేశాలు తమ పెట్టుబడులను లాభదాయక కంపెనీలలో పెడతారు. వివిధ దేశాల మధ్య మూలధనం పెట్టుబడి బదిలీ జరుగుతుంది.


19. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడుల లో ముఖ్య ప్రవాహాలను తెలపండి?

అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో మనం మూడు ముఖ్య ప్రవాహాలను గమనించవచ్చు.
 .వస్తు సేవల ప్రవాహం.
. శ్రమ ప్రవాహం: ఉపాధి వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం.
 .పెట్టుబడి ప్రవాహం స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడానికి పెట్టుబడి ప్రవాహం అంటారు


20.అరబ్ వసంతం అనగానేమి?

ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ,తునీషియా ,ఈజిప్టు ,వంటి దేశాలలో ఉన్న నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటుచేసుకున్నాయి అటువంటి విప్లవాలను ప్రసార మాధ్యమాల్లో "అరబ్ వసంతం "గా పేర్కొన్నారు.



______________________________


"Education is the most power ful weapon which you can use to change the world ".
.🌹🌹🌺🌺🌹🌹
























































22, డిసెంబర్ 2020, మంగళవారం

రాంపురం -- గ్రామ ఆర్థిక వ్యవస్థ

 రాంపురం:గ్రామ ఆర్థిక వ్యవస్థ .


💐💐💐💐💐💐💐💐💐💐💐.


1.ఉత్పత్తి కారకాలు  పేర్కొనండి?

ఉత్పత్తి కారకాలు భూమి ,శ్రమ, మూలధనం ,వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం.

2.స్థిర పెట్టుబడి అనగానేమి?

ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైనా యంత్రాలు ట్రాక్టర్లు యంత్ర పరికరాలు పై చేసే పెట్టుబడిని స్థిర పెట్టుబడి అంటారు.

3.రాంపురం లో వ్యవసాయేతర  కార్యకలాపాలు ఏమిటీ?

వ్యవసాయం కాకుండా ఇతర కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి చేపడితే వాటిని వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు .పాడి పరిశ్రమ, చిన్న తరహా వస్తువుల తయారీ ,దుకాణాల నిర్వహణ ,కోళ్ల పెంపకం ,టీ కొట్టు ల నిర్వహణ ,శీతలపానీయాల అమ్మకం ,పుస్తకాల షాపుల నిర్వహణ మొదలగునవి.


4.నిర్వాహణ పెట్టుబడి అంటే ఏమిటి?

ఉత్పత్తి కార్యకలాపాల కోసం  చేసే పెట్టుబడిని నిర్వహణ పెట్టుబడి అంటారు .   వస్తువుల తయారీకి  అవసరమయ్యే  పెట్టుబడి .

5.బౌతిక పెట్టుబడి అంటే ఏమిటి?

ఉత్పత్తి చేయడానికి రైతులకు అవసరమయ్యే ఆర్థిక వనరులను భౌతిక పెట్టుబడి అంటారు. ఉదాహరణకు రసాయనిక మందులు, సాగునీరు, పురుగు మందుల వినియోగం, అంతటిి  భౌతిక పెట్టుబడిగాా భావిస్తారు.

6.బహుళ పంటల సాగు అంటే ఏమిటి?

ఒక విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు.

7.చిన్న కారు రైతులు అంటే ఏమిటి?

రెండు హెక్టార్ల కంటే తక్కువ  వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులను చిన్నకారు రైతులు అంటారు .

8.M.G.N.R.E.G.A. ను విస్తరించుము?

మహాత్మా గాంధీ  జాతీయ  గ్రామీణ ఉపాధి హామీ పథకం.

9.మిగులు ఉత్పత్తి అంటే ఏమిటి?

ఉత్పత్తి అయిన  వస్తువుల నుండి  వినియోగాన్ని తీసివేస్తే వచ్చేది మిగులు    ఉత్పత్తి.

1౦.రాంపురం లోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలి లభిస్తుంది ఎందుకు?

రాంపురం గ్రామంలో   పని చేయడానికి వ్యవసాయ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంది. .కాబట్టి తక్కువ వేతనాల కే పని చేయడానికి కూలీలు సిద్ధంగా ఉంటారు.
 పెద్ద రైతులు ట్రాక్టర్లు యంత్ర పరికరాల సహాయంతో వ్యవసాయం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి.
 కావున కూలీలకు తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు.

11. రాంపురం గ్రామంలో ఉత్పత్తి పెంచడానికి వివిధ పద్ధతులు ఏమిటీ?

1.సాగునీటిి సదుపాయాలను పెంచుకోవడం .2.బహుళ (అనేక) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడం.
 3.భూసారాన్ని పెంచడం .
4.పంట మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టడం. 5.అంతర పంటల సాగు చేయడం. 
6.అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడడం. 7.ఎరువులు రసాయనిక మందులను వ్యవసాయంలో వినియోగించడం .
8.యంత్రాలు యంత్ర పరికరాల సహాయంతో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ వ్యవసాయ. దిగుబడి సాధించే పద్ధతులు వాడడం. 

12.ఒక  హెక్టార్ అంటే ఏమిటి?

భూమిని కొలవడానికి  ప్రామాణిక కొలమానంగా హెక్టార్లు ఉపయోగిస్తారు. 
ఒక హెక్టారుకు 10000 చదరపు మీటర్లు వ్యవసాయ విస్తీర్ణాన్ని కలిగి ఉంటే దాన్ని ఒక హెక్టారు అంటారు.

13.రాంపురం లో ఆధునిక వ్యవసాయ విధానాల ను పేర్కొనండి?

వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది.
 సాగు నీటిి లభ్యత పెరగడం వల్ల విద్యుత్ యంత్రాల ను వినియోగించి నీటిని ఎక్కువ అ సాగు విస్తీర్ణానికి వాడుకుంటున్నారు.
  బోరుబావులను వినియోగించడం జరుగుతుంది.
 ట్రాక్టర్ల  వ్యవసాయ  యంత్ర పరికరాలు వరి కోత యంత్రాలు వినియోగం పెరిగింది .
బహుళ పంటల సాగు విధానం అమలులోకి వచ్చింది .
అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ వంగడాలను (విత్తనాలు) వినియోగం, రసాయనిక ఎరువులు  రసాయనిక మందులు, వినియోగం పెరిగింది.

7, డిసెంబర్ 2020, సోమవారం

ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం

 ప్రశ్నలు సమాధానాలు


1.N. A. T. O. ను విస్తరించుము?

 North Atlantic treaty organisation 


2.S.E.A.T.O.  ను విస్తరించుము?
South east Asian treaty organisation 

3.C.E.N.T.O. ను విస్తరించుము?
Central treaty organisation 


4. సై నిక ఒప్పందం అనగానేమి?

రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం సైనిక ఒప్పందం అంటారు. ప్రపంచ యుద్ధాల సమయంలో అనేక దేశాలు ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి .Ex N.A.T.O. ,S.E.A.T.O..


5.P.L.O. ను విస్తరించుము?

పాలస్తీనా లిబ రేషన్ ఆర్గనైజేషన్.

6.పరోక్ష యుద్ధం అంటే ఏమిటి?

ఒక దేశం పై మరొక దేశం నేరుగా యుద్ధం చేయకుండా సాంకేతిక పద్దతుల ద్వారా ఉగ్రవాద చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను దేశాన్ని దెబ్బతీసే టువంటి చర్యలను పరోక్ష యుద్ధం అంటారు

7.ప్రచ్ఛన్న యుద్ధం అనగానేమి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యమైన అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధం అంటారు.

8.అలీ న విదానం అంటే ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా (ప్రజాస్వా మ్య) కూటమిలో గాని రష్యా (కమ్యూనిస్టు) కూటమి గాని చేరకుండా తటస్థ విధానాన్ని అవలంబించడానికి అలీన విధానం అంటారు .అయితే  వివిధ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సహకారాలను పెంపొందించుకునే ఉద్దేశ్యంతో నెహ్రూ  ఈ విధానాన్ని అనుసరించారు

9.వీటో అధికారం అనగానేమి?

ఐక్యరాజ్యసమితి లోని భద్రతామండలి  చేసే నిర్ణయాలను ను శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించే విధానాన్ని లేదా తిరస్కరించే విధానాన్ని వీటో అధికారం అంటారు ఈ అధికారం అమెరికా ,బ్రిటన్ ,చైనా ,ఫ్రాన్స్ ,రష్యా, దేశాలకు మాత్రమే కలదు.


10. వలస పాలన నుండి విముక్తి అంటే ఏమిటి?

ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తూ ఉంటే అటువంటి దేశాలను ఆ పాలిత దేశాలనుంచి విముక్తి చేయడాన్ని వలస పాలన విముక్తి అంటారు .Ex. భారతదేశాన్ని బ్రిటన్ దేశం నుంచి విముక్తి చేయడం.


11.(U. N. O). ఐక్యరాజ్య సమితి లో  శాశ్విత సభ్య దేశాలు ఏవి?

అమెరికా ,బ్రిటన్, చైనా ,ఫ్రాన్స్, రష్యా  దేశాలకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలదు.

12. ఐక్యరాజ్య సమితి లోగో (  పతాకం) ను వివరించండి?

ఐక్యరాజ్యసమితి పతాకం: నీలిరంగు పతాకంపై గ్లోబు, గ్లోబు కు ఇరువైపులా ఆలివ్ కొమ్మలు ఉంటాయి .
నీలిరంగు అభివృద్ధికి నిదర్శనం .
గ్లోబు ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల ను సూచిస్తుంది .
 ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం.

13.సైనిక ఒప్పందం వల్ల అగ్రరాజ్యాల కు  అందుబాటులో కి వచ్చిన కీలక  వనరులు ఏవి?

సైనిక ఒప్పందంం వల్ల  అగ్ర రాజ్యాల ప్రభావం పెరిగి వాటికి క్రింది వనరులు అందుబాటులోకి వచ్చాయి.
: చమురు ఖనిజాలు వంటి కీలక వనరులు. :   ఉత్పత్తులకు మార్కెట్ .
:పెట్టుబడులుు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు .
తమ సైనికులను ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు .
తమ భావజాల వ్యాప్తి .పెద్ద  మొత్తంలో ని ఖర్చుకి ఆర్థిక మద్దతు.

14.ఆయుధ, అంతరిక్ష పోటీ వల్ల జరిగిన పరిణామాలు ఏమిటీ?

1. ఆయుధాలు పైన ఖండాంతర క్షిపణుల విధ్వంసకర ఆయుధాలు పైన ప్రపంచ దేశాలు ఖర్చును పెంచాయి.

2. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ భయం వాతావరణం ఏర్పడింది.

3. వివిధ దేశాల మధ్య గూడ చర్యలు చోటుచేసుకున్నాయి.

4.వివిధ దేశాల మధ్య సైనిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం ,సైద్ధాంతిక విభేదాలు పెరిగాయి.



15.బాoడుoగ్ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ఆసియా ఆఫ్రికా ఖండాలలో ని 29 దేశాల ప్రతినిధులు 1955 ఏప్రిల్ 18 నుండి 24 వరకు ఇండోనేషియాలోని బాండుంగ్ లో సమావేశం అయ్యారు.

బాండుంగ్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు.

ఆసియా ఆఫ్రికా లో ఆర్థిక అభివృద్ధి పెంపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తించడం .

శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించడం.
 ఆఫ్రికా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడం .
వలసపాలకుల వైఖరిని ఖండిస్తూ ప్రాథమిక హక్కులు ప్రజలకు అందేలా చూడడం.

16.అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి?

అలీనోద్యమ మొదటి సమావేశం 1961 సెప్టెంబర్ లో యుగోస్లేవియా లోని బెల్గ్రేడ్ లో జరిగింది 2012నాటికి సభ్య దేశాల సంఖ్య 120 కి పెరిగింది .
దీని ముఖ్య ఉద్దేశాలు

 అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్రాన్ని సంపాదించాయి.
 పెరుగుతున్న ప్రపంచ యుద్ధ తీవ్రతలు మిగిలిన ప్రపంచం పై దాని ప్రభావం పడకుండా చూడడం.
 వలస పాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ  సైనిక శిబిరంలో చేరకుండా చూడడం.

17.మధ్య ప్రాచ్యం అనగానేమి?

ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు.

18.పశ్చి మ ఆసియా సంక్షోభo అనగానేమి?

పశ్చిమాసియాలో అరబ్బులకు యూదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలను పశ్చిమాసియా సంక్షోభం అంటారు.

19.జియోనిస్ట్ ఉద్యమం అనగానేమి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి ఇ తమ మాతృభూమి అయినా పాలస్తీనాను తిరిగి పొందే ఉద్దేశంతో చేసిన ఉద్యమాన్ని  జియోనిస్ట్ ఉద్యమం అంటారు.


20.మూడవ ప్రపంచ దేశాలు  అని అలీన దేశాలను ఎందుకంటారు?

అప్పుడే స్వాతంత్రం పొందిన దేశాలను మూడో ప్రపంచ దేశాలు అంటారు. 
ఈ దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవి .
ఈ దేశాలలో పేదరికం ,అనారోగ్యం ,అసమానత్వం ,వలసవాదం వంటివి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
 కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావం తో కూడిన పరిస్థితులు నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. 
ఈ దేశాల యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అలీన ఉద్యమం సరైనది అని భావించడం వల్ల ఇందులో చేరాయి. కాబట్టి ఈ దేశాలను అలీనోద్యమ దేశాలు అంటారు.


21.వాగ్దత్త భూమి అనగా?.

యూదులు పాలస్తీనా భూభాగాన్ని వాగ్దత్తభూమి అంటారు.


22.ఆరబ్బులు,యూదులు  మధ్య  ఘర్షణలకు కారణాలు ఏంటి?

అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది .
అక్కడ ఉన్న జెరూసలేం, యూదులు, క్రైస్తవులు ,ముస్లింలకు పవిత్ర స్థలం.
యూదులను  నిర్వాసితులు చేయడంతో వారు యూరప్ ,ఆసియా అంతటా వలస వెళ్లారు.   
 ఏసుక్రీస్తు  సిలువ  వేయడానికి యూదులను బాధ్యులను చేసి వారిని వేధింపులకు గురి చేశారు .
జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో లక్షలాది మంది యూదులను చంపటం దీనికి పరాకాష్ట.
 యూదుల తమ దేశాన్ని ని తిరిగి పొందాలని   జియోనిస్ట్ ఉద్యమం చేపట్టారు.
అదే సమయంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనడంతో అమెరికా, యు. ఎస్ .ఎస్ .ఆర్  . లు తమ ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాయి.
1947 లో లో ఐక్యరాజ్యసమితి ఇ పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి  అరబ్బులకు ,మరొకటి యూదులకు కేటాయించింది.
అయితే ఇప్పటికి కూడా అరబ్బులకు యూదులకు సరైనటువంటి పరిష్కారం లభించక పోవడం వల్ల ఆ ప్రాంతం నిత్యం ఘర్షణ తో సతమతమవుతూ ఉంది.



23.పంచశీ ల ఒప్పందం ను వివరించండి?
1. ఒక దేశ సర్వసత్తాక తను భౌగోళిక తను మరొకరు గౌరవించడం.
2 ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం .
3.దాడులకు దిగడం వివాదాలను అవగాహనతో పరిష్కారం చేసుకోవడం..
4.అంతర్జాతీయ సంబంధాలు సహకారం కోసం కృషి చేయడం.
5. శాంతియుత సహజీవనానికి ప్రోత్సహించడం.


24.గోర్బచేవ్ పరిపాలన  విధానాలు  తెల్పుము?

రష్యాలో గోర్బచేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలు చేయడానికి రాజకీయ సంస్కరణలు చేయడానికి ప్రయత్నించాడు .
ఈయన ఉదార వాద సిద్ధాంతాలు కలవాడు.
 పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రయత్నం చేశాడు.

గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

25 గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా, అంటే ఏమిటి?

గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను  గ్లాస్ నో స్ట్,పేరిస్ట్రోయికా అంటారు.

26.ఏక ధ్రువ ప్రపంచం అంటే ఏమిటి?

1991లో యు.ఎస్.ఎస్.ఆర్. పతనం కావడంతో తో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ప్రారంభమైంది . అమెరికా ఆర్థిక శక్తిగా  తయారైంది .అది ఏకధృవ ప్రపంచం గా మారింది.

27.ద్విద్రువ ప్రపంచం అంటే ఏమిటి?

వలస దేశాలు స్వాతంత్రం పొందిన తరువాత తర్వాత అమెరికా రష్యాలు రెండు  ప్రపంచ ఆర్థిక శక్తులుగా పరిణమించాయి. ఈ రెండు దేశాల ప్రపంచ ప్రాబల్యాన్ని ద్వి ధ్రువ ప్రపంచం అంటారు.

28.U. S. S. R. పతనానికి గల కారణాలు వ్రాయండి?


29.మెక్ మోహన్ రేఖ అనగానేమి?

భారతదేశం చైనా దేశాల మధ్య సరిహద్దురేఖ మెక్ మోహన్ రేఖ అంటారు.

30.భారత దేశం, చైనా, సంబంధాలను వ్యాఖ్యానిo చుము?

1949లో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్టు పార్టీ ని గుర్తించిన తొలి దేశాలలో భారత దేశం ఒకటి

భారతదేశం చైనా దేశానికి   ఐక్యరాజ్యసమితిలో శాశ్వత  సభ్య స్థానానికి మద్దతు తెలిపింది.
1954 april 29 న పంచశీల ఒప్పందం పై రెండు దేశాలు నాయకులు సంతకం చేశారు.
టిబెట్ భారతదేశాల సరిహద్దు అయిన మెక్ మోహన్ రేఖను చైనా అంగీకరించలేదు. 
ఆక్సాయ్చిన్ ప్రాంతం లో  సరిహద్దు వివాదం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది .
పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ
1962 లో భారతదేశంపై చైనా దండెత్తింది.
 మూడో ప్రపంచ దేశాల్లో తన ఆధిపత్యానికి భారత్ అవరోధంగా ఉందని భావించింది.

రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా గా కొనసాగిన కొన్నిసార్లు  ఘర్షణలకు కూడా కారణమవుతూ ఉన్నాయి


31.పాకిస్థాన్,భారత్ దేశం సంబంధాలను వివరించండి?

మత ప్రాతిపదికపై భారత దేశం రెండు రాజ్యాలు గా విడిపోయిన తర్వాత చెలరేగిన సంఘటనలు ప్రభావం ఇరుదేశాల సంబంధాలను శాసిస్తుంది .
కాశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య వివాదాలకు కారణమవుతోంది .
1966లో భారత్ పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరింది .ఈ ఒప్పందాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉంది .
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో భారత జోక్యం చేసుకోవడంతో ఈ రెండు దేశాలు మరో సారి యుద్ధం చేసుకున్నాయి.
 1999లో కార్గిల్ సమస్య భారత్-పాక్ల మధ్య యుద్ధానికి కారణం అయింది .
అదే సమయంలో సంస్కృతి, నాగరికత ,వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, సౌహార్దం పర్యటనలు, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

32. బంగ్లాదేశ్, భారత దేశం సంబంధాలు ను వివరించండి?

బంగ్లాదేశ్  భారతదేశం రెండూ కూడా సరిహద్దు దేశాలు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత ప్రభుత్వం  కీలక పాత్ర పోషించింది .
బ్రహ్మపుత్ర నది గంగా నది జలాల పంపకంలో రెండు దేశాల మధ్య విభేదాలు  ఉన్నాయి.

అయినప్పటికీ రెండు దేశాలు ఆర్థిక రంగంలో సాంకేతికంగా సాంస్కృతికంగా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాయి.

33.శ్రీలంక భారత దేశం మధ్య సంబంధాలు ను వివరించండి?

భారతదేశం శ్రీలంక 2 ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక 1948లో స్వాతంత్రం పొందింది శ్రీలంక భారత్ దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయ తమిళం మాట్లాడే అల్పసంఖ్యాకుల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన విధానం భారతదేశం శ్రీలంక సంబంధాల పట్ల ఘర్షణలకు కారణం అయింది .
ప్రస్తుతం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి

34. L.T.T.E ?

Libration  of Tamil Tigers Eelam

35.సిమ్లా ఒప్పందం గురించి వ్యాఖ్యానించండి?

1945లో అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్  వా  వేల్  కార్యనిర్వాహక మండలిలో భారతీయులను ప్రేమించే ఈ విషయమై చర్చించడానికి సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
 దీనినే సిమ్లా ఒప్పందం అంటారు .కార్యనిర్వాహక మండలి లో పదవులన్నీ భారతీయులతో భర్తీ చేయడం .
హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ఇస్తామని ప్రకటించడం.
  ముస్లిం లీగ్ సభ్యులను ముస్లింలకు మాత్రమే నామినేట్ చేస్తుందని మహమ్మద్ అలీ జిన్నా పట్టుపట్టడంతో  విఫలమయ్యాయి.

36."ముక్తి బాహిని" అనగా

 ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు చేసిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని mukti bahini అంటారు
💐💐💐💐💐💐💐💐

3, డిసెంబర్ 2020, గురువారం

రాజకీయ ధోరణలు ఆవిర్భావం1977-2000.

           ప్రశ్న సమాధానములు.

     💐  ×××××××××💐
1.సరళీ కృత ఆర్ధిక విధానం అంటే ఏమిటి?

 1991వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం  ఈ విధానం భారతదేశంలో ప్రవేశపెట్టింది .దీని ప్రకారం విదేశీ పెట్టుబడిదారులను పరిశ్రమలను భారతదేశంలోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే ఆర్థిక విధానాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు.

2.సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి?

భారతదేశ ము లో  జరిగే ఎన్నికలలో  ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు వివిధ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అటువంటి ప్రభుత్వాలను సంకీర్ణ ప్రభుత్వం అంటారు.ex UPA, NDA.

3.మతతత్వ వాదం అనగానేమి?


భారతదేశం వివిధ రకాల మతాలకు పుట్టినిల్లు. ఇటువంటి భారతదేశంలో తమ మతం గొప్పదని ఇతర మతాలు తక్కువని, ఛాందస భావాలు, మూఢనమ్మకాలు కలిగి ఉండడమే మతతత్వం అంటారు .  ఇది దేశ ప్రజల మధ్య  కలహాలను  సృష్టిస్తుంది .ఇది ఇది దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుంది.


4.జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి?

దేశం మొత్తం మీద  శాంతిని కాపాడే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించ దానికి  శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దేశ సమగ్రతను పరిరక్షించడానికి ,కేంద్ర ప్రభుత్వం చేసిన అత్యవసర చట్టాన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు.

5.ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానేమి?

సిక్కుల పవిత్ర్ర స్థలమైన న స్వర్ణ దేవాలయం ను  ఉగ్రవాదులు ఆక్రమించు కోగా వారిని అక్కడ నుంచి ఖాళీ చేయడానికి భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్్ అంటారు .

6.అల్ప సంఖ్యాకులు అంటే ఏమిటి?

దేశ జనాభాలో ఏ మతానికి చెందిన వారు  తక్కువ సంఖ్యలో ఉన్నారో వారిని అల్పసంఖ్యాకులు అని అంటారు Ex ముస్లింలు ,క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు.

7.అధిక సంఖ్యాకులు అనగానేమి?

దేశ జనాభాలో ఏ మతం వారి సంఖ్య అధికంగా ఉంటుందో వారిని అధిక సంఖ్యాకులు అంటారు ఉదా. హిందువులు

8. అత్యావసర పరిస్థితి లో జరిగిన  పరిణామాలు ఏమిటి?

ప్రాథమిక హక్కులను నిలిపివేయడం.
పౌర హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం
 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయడం. 
ఎన్నికల వివాదాలు న్యాయ స్థానాలకు జోక్యం లేకుండా చేయటం. 
రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం.
 న్యాయవ్యవస్థను పార్లమెంటుకు లోబడి ఉండేలా చూడడం .
ఇలాంటి పరిణామాలు జరిగాయి.


9. 1970 లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తెల్పుము?

1. భారతీయ లోక్ దళ్. (B.L.D ) .
కాంగ్రెస్ (ఓ ).
సి పి ఐ (ఎం) భారతీయ కమ్యూనిస్టు పార్టీ (marxists).
డిఎంకె - ద్రవిడ మున్నేట్ర కజగం .
జన సంఘం.
 శిరోమణి అకాలీదళ్  S.A.D.
ఇలాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి

10.పార్టీ ఫిరాయింపులు అనగానేమి?

ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికై తర్వాత కొద్దికాలానికి వేరొక పార్టీలో చేరడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు.

11.రాష్ట్ర పతి పాలన అనగానేమి?

రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పాలించే లేకపోతే గవర్నర్ రాష్ట్రపతికి శాసనసభను రద్దు చేయమని సిఫార్సు చేయవచ్చు అప్పుడు ప్రధానమంత్రి సలహా తో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి పాలనా బాధ్యతను గవర్నరు చేపట్టామని కోరవచ్చు దీనిని రాష్ట్రపతి పాలన అంటారు.

12.తెలుగుదేశం పార్టీ  స్థాపనకు దారితీసిన కారణాలు ఏవి?

తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించడం.
 తరచుగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండటం .
అవినీతి అక్రమాలు పెరిగిపోవడం సరైన పాలనా వ్యవస్థ లేక అభివృద్ధిలో వెనక వెనుకబాటుతనం ఈ కారణాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది


13(.N. T. R. ) తెలుగుదేశం పార్టీ  పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి?

తెలుగుదేశం పార్టీని 1982 సంవత్సరంలో లో (ఎన్టీఆర్) నంద మూరి తారక రామారావు గారు తన 60వ పుట్టినరోజు సందర్భంగా స్థాపించాడు .
1.పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
 2.ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం.
3. మద్యపాన నిషేధం .
4.మహిళలకు ఆస్తి హక్కు. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు

14.అస్సాం ఉద్యమం యొక్క  ప్రాముఖ్యత ఏమిటి?

అస్సాంలో ఉద్యమం స్వయంప్రతిపత్తి కోసం ప్రారంభమైంది.
అస్సాంలో అస్సామీ భాష కాకుండా కాకుండా బెంగాల్ భాష ఎక్కువగా మాట్లాడటం. అస్సామీ పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూడడం .
బంగ్లాదేశ్ నుండి వలసలు అస్సాంలో కి అధికంగా జరగడం. 
టీ తోటల మీద ఆధిపత్యం స్థానికులకు కాకుండా బెంగాలీలకు ఉండడం.
  చమురును రాష్ట్రం నుండి తరలించి వేరే చోట శుద్ధి చేయడం.
ఉపాధిలో లో స్థానిక లకు అవకాశాలు కాకుండా  బయటి వారికి ప్రాధాన్యతనివ్వడం.
 సంస్కృతి, జనాభా అంశాలే కాకుండా ఆర్థిక కోణాలు కూడా ఉద్యమానికి చాలా ప్రాముఖ్యత వహించాయి.



15.అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ఏవి?

అస్సాం లో ఉన్న గిరిజన తెగలు ప్రధానంగా బోడో లు, khaseelu, కర్బీ లు మిజోలు,.

16. ఈశాన్య   ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించటానికి మూడు ముఖ్య కారణా లు ఏవి?

పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం
ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలు ప్రయోగించడానికి 3 అంశాలు కారణమయ్యాయి .
1 చైనా బర్మా బంగ్లాదేశ్ లతో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండటం.
 2. తిరుగుబాటు బృందాలు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవడం .
3 అల్పసంఖ్యాక వర్గాల పై తిరుగుబాటు బృందాలు పెద్ద ఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడడం .
ఈ కారణాల వల్ల సైనిక దళాలు ప్రవేశించడంతో పౌర హక్కులు స్వేచ్ఛ రద్దయ్యాయి.


17.పంజాబ్ ఆందోళన కు గల కారణాలు వ్యాఖ్యానిoచండి?


పంజాబ్లో స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం రూపుదిద్దుకుంది .
అత్యధిక శాతం మాట్లాడే భాష మతం ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది .సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరడం .
రాజధాని చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా కాక పంజాబ్కు రాజధానిగా ప్రకటించాలని కోరడం.
 బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి అధిక శాతం నీళ్లు పంజాబ్ రాష్ట్రానికి కావాలని కోరడం.

తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న  బింద్రే నవాలా వేర్పాటు వాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం కలుస్తాను కావాలని కోర సాగాడు. 
స్వర్ణ స్వర్ణ దేవాలయంపై    సైనిక చర్య పై కారణాల వల్ల పంజాబ్ లో లో ఉద్యమం తీవ్రరూపంం దాల్చింది.


18. అస్సాం ,పంజాబ్ ఉద్యమా ల పోలిక, తేడా లను వ్రాయండి?
అస్సాం పంజాబ్లోని ఉద్యమాల రెండూ కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే ప్రారంభమయ్యాయి.
 తర్వాత కాలంలో హింసాత్మక మార్గాన్ని ఎన్ను కు న్నాయి  .
రెండు కూడా స్థానిక మైనార్టీల పై కక్ష సాధింపు చర్యలు కు కు  పూనుకున్నాయి.

పంజాబ్లో ఉద్యమం ఒక మతపరమైన అంశం .

అస్సాంలో భాష సంస్కృతి ఆర్థిక సాంస్కృతిక అంశాలు ఉద్యమానికి దోహదం చేశాయి.
 రెండు రాష్ట్రాలలో లో ఉద్యమాలు శాంతి భద్రతల సమస్యను సృష్టించాయి.
 జాతి సమగ్రతకు సార్వభౌమత్వానికి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా పరిణమించాయి.

19.ఆంద్రప్రదేశ్ అస్సాం ఉద్యమాల మధ్య పోలిక ,తేడాలను వివరించండి?

 ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి
.
 అస్సాంలో ఉద్యమం సామాజిక ఉద్యమం ఇక్కడ భాష సంస్కృతి నిరుద్యోగం ఉపాధి వలసల యొక్క సమస్య ప్రధానమైనది.

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సమస్య పరిష్కారం కాబడినది .
కానీ అస్సాంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి అస్సాం లోని ప్రాంతీయ తమ పోరాటం నిర్విరామంగా కొనసాగించారు

20.టెలికాం విప్లవము వల్ల  జరిగిన మార్పులు ఏమిటి?

టెలి కమ్యూనికేషన్ రంగం మానవ జీవనంలో అనేక సానుకూల ప్రతికూల మార్పులు కూడా తెచ్చింది .

అనుకూల ఫలితాలు.

1. సమయం ఆదా అవుతుంది .
2.వేగంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.
 3.ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు వేగంగా చేసుకునే అవకాశం లభించింది .4.సౌకర్యవంతమైన జీవితం వీలవుతుంది.

వ్యతిరేక ఫలితాలు.

ఇంటర్నెట్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి సౌకర్యాలకు ప్రజలు బానిసలై పోయి అధిక సమయాన్ని అందులో వే చ్చేస్తున్నారు .
 అధిక సమయం కంప్యూటర్ ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా  ఏర్పడుతున్నాయి. మానవ సంబంధాలు దారి తప్పుతున్న నాయి..

21. సంకీర్ణ ప్రభుత్వా ల( U.P A.,N .D .A. జనతాదళ్)  శకం లో జరిగిన పరిణామాలు వివరించండి? 

సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థలో పార్టీలన్నీ కలిసి రాజకీయ సిద్ధాంతాలు కార్యక్రమాలను కలుపుకుని కనీస ఒప్పందాలకు వచ్చింది .
రాజకీయాలు విధానాలలో కేంద్రప్రభుత్వం సున్నితత్వం తో వ్యవహరించవలసి వచ్చింది.
సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు సమన్వయ సంఘాలు అంటే పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలి గాయి.

22.బెంగాల్ లో వామపక్ష విధానాలు ను వ్యాఖ్యానిo చండి?

బెంగాల్లో్లో్లో వామపక్ష ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది .
కౌలుదార్లు సమస్యలను పరిష్కరించింది .పరిపాలనా సంబంధ ఆలస్యం తొలగించింది .భూస్వామ్య్య వర్గాల పెత్తనం లేకుండా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసింది.
 కౌలుదారు లను భూస్వాములు బలవంతంగా తొలగించడానికి  వీలు లేకుండా చేసింది.
గ్రామీణ పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది.

23.ఆపరేషన్ బ ర్గా అంటే ఏమిటి?

బెంగాల్ లో జూన్ 1978 సంవత్సరంలో ప్రభుత్వం కౌలుదార్లు పేర్లను నమోదు చేసి వాళ్ల హక్కులను కాపాడడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది .
కౌలుదారు లను బెంగాల్ లో బర్గా దారులు అంటారు వీరు భూస్వాముల భూముల సాగుచేస్తూ అధిక మొత్తంలో భూ స్వాములకు వాటాగా చెల్లిస్తూ ఉంటే వారు ఈ సమస్య పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ 
 బర్గా.

24.73,74 వ రాజ్యాంగ సవరణ లను  వ్యాఖ్యానిo చండి?

1992 వ సంవత్సరంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనకు గుర్తింపు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేసింది .
73 వ రాజ్యాంగ సవరణలు గ్రామస్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించగా 74వ రాజ్యాంగ సవరణలు పట్టణ నగరాలకు వాటి స్థాయి లో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగు ద్వారా మొదటిసారి ఎన్నుకున్నారు  . అందులో1/3 స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
 షెడ్యూలు కులాలు షెడ్యూలు జాతులకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.

25.ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రధాని p. v. నరసింహారావు చర్యలు పేర్కొనండి?

1992వ సంవత్సరం పీవీ నరసింహారావు నేతృత్వంలో సరళి కృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
 ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం .
రైతులకు ఇచ్చే సబ్సిడీ కోత విధించడం .
ప్రజా సేవ ఆరోగ్యం వంటి అంశాల్లో  ఖర్చులు తగ్గించుకోవడం .
విదేశీ దిగుమతుల మీద పరిమితులను పనులను తగ్గించు కోవడం .
విదేశీ పెట్టుబడులకు పరిమితులను తగ్గించు కోవడం .
ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ ,బీమా ,విమానయానం, వంటివాటిలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు.


💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

12, నవంబర్ 2020, గురువారం

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

 

ప్రశ్నల సమాధానం నిధి.

1.రాజ్యాంగ సభ అంటే ఏమిటి?

భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన కోసం స్వాతంత్రానికి ముందు ఏర్పాటు చేసినటువంటి సభ్యుల సమూహాన్ని రాజ్యాంగ సభ అంటారు.
1946లో రాజ్యాంగ సభ సభ్యులు ను రాష్ట్ర శాసన సభలు పరోక్షంగా  ఎన్నుకున్నా యి

2.రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?


భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, ,లక్షణాలను  మూల తత్వాలు లను, వివరించే ముందు భాగమే  రాజ్యాంగ ప్రవేశిక .దీనిని నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన చేశారు.

3.ఏక పౌర సత్వం అంటే ఏమిటి?

ఒక దేశానికి చెందిన నివాస పరమైన చట్టబద్ధమైన హక్కు ను ఏక పౌరసత్వం అంటారు. 
భారతదేశంలో ఒకే పౌరసత్వం అమలులో ఉంది.

4.సమాఖ్య వాదం అనగానేమి?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చేసుకుని ఎవరి పరిధిలో వారు చట్టబద్ధంగా పరిపాలన చేసుకోవడాన్ని సమాఖ్య విధానం అంటారు .

5.పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏమిటి?

లోక్ సభ , రాజ్య సభ ,మరియు రాష్ట్రపతి  కలిసి పార్లమెంట్ ఏర్పడుతుంది. 
పార్లమెంటరీ వ్యవస్థలో అధ్యక్షుడు దేశానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు రాష్ట్రపతి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడం.

6.అధ్యక్ష తరహా విధానం అనగానేమి?

దేశానికంతటికీ పరిపాలన బాధ్యత వహించే విధానాన్ని అధ్యక్ష తరహా విధానం అంటారు .

.ఇందులో అధ్యక్షుడు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి గా వ్యవహరించి పరిపాలన బాధ్యత అంతా తన చేతిలో ఉంచుకుంటాడు .


7.భారత రాజ్యాంగం లో అధికారాలు ఎన్ని 
జాబితా లు గా విభజించారు?అవి ఏవి?

భారత రాజ్యాంగంలో అధికారాలను మూడు రకాలుగా మూడు జాబితాలు గా విభజించారు అవి .
1కేంద్ర జాబితా 
2. రాష్ట్ర జాబితా .
3ఉమ్మడి జాబితా

8.ముసాయిదా రాజ్యాంగ o లో అధికరణాలు ,షెడ్యూళ్లు ఎన్ని?

ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణ లు 8 షెడ్యూళ్ళు కలవు భారత దేశం ముసాయిదా రాజ్యాంగం అతి పెద్దది.

9.ప్రస్తుత రాజ్యాంగ o లో అధికరణా లు షెడ్యూళ్లు  ఎన్ని?

ప్రస్తుతం బారత రాజ్యాంగంలో 448అధికరణలు .
12 షెడ్యూళ్ళు 
25 భాగాలు కలవు.

10.అఖిల భారత సర్వీసులు అంటే ఏమిటి?

భారతదేశానికి అంతటికీ పరిపాలనా పరమైన సర్వీసులను అందించే అధికారులను అఖిల భారత సర్వీసులు అంటారు ఉదాహరణ ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్.(I.A.S.  I.P.S.)

11. రాజ్యాంగ o లోని మౌలిక సూత్రాలు వివరించండి?.

భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు 1.పార్లమెంటరీ వ్యవస్థ 
2.సమాఖ్య వ్యవస్థ .
3.సర్వసత్తాక దేశం.
4. ఒకే న్యాయ వ్యవస్థ .
5.లిఖిత పూర్వక రాజ్యాంగం.
6. అఖిల భారత సర్వీసులు .
7.సంక్షేమ రాజ్యం మొదలగునవి

12.భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య  సూత్రాలు పేర్కొనండి?

13.రాజ్యాంగ ప్రవేశిక లో కొత్తగా చేర్చిన పదాలు ఏవి?

భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన అటువంటి పదాలు "సామ్యవాద"" లౌకిక "అనే పదాలను చేర్చడం జరిగింది.

14 రిజర్వేషన్లు అంటే ఏమిటి?

సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గానికి ముఖ్యంగా షెడ్యూలు కులాలు ,షెడ్యూల్ తెగలకు ,ఆర్థిక ,సామాజిక ,రాజకీయ య న్యాయాన్ని ,సమానత్వాన్ని  సాధించడానికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని చర్యలు  చేపట్టారు వాటిని రిజర్వేషన్లు అంటారు.

15.పార్లమెంటరి ,  అధ్యక్ష తరహా విధానం మధ్య వ్యత్యాసాలు తెల్పుము?

పార్లమెంటరీ విధానం:-
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు నామమాత్రం.
 ప్రధానమంత్రి యదార్థ పాలకుడు .
కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం మంత్రులు అందరూ దీనిలో సభ్యత్వం కలిగి ఉంటారు 
పార్లమెంటరీ విధానంలో అధ్యక్షుడు మంత్రి మండలి సలహాలకు కట్టుబడి ఉండాలి .పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి మంత్రులకు అధిపతి గా వ్యవహరిస్తాడు.

అధ్యక్ష తరహా విధానం:-

అధ్యక్ష తరహా విధానం లో అధ్యక్షుడే సర్వాధికారి అన్ని నిర్ణయాలు అధ్యక్షుడే తీసుకుంటాడు.
 కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ లో అంతర్భాగం కాదు.
 అధ్యక్షులకు వివిధ సలహాదారులు సలహాలు అందిస్తారు .
శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖల మధ్య అధికార పంపిణీ ఉంటుంది.

16."సమానత్వం" భావన ను తెల్పే కరపత్రం తయారు చేయండి?

పాఠశాల సమాజపు ప్రతి రూపం.
 వివిధ  సమూహాల నుండి పిల్లలు పాఠశాలకు రావడం జరుగుతూ ఉంటుంది .
పాఠశాలలో లో పిల్లలకు పేద ధనిక అనే  భావనలు రాకుండా అందరికీ ఒకే రకమైన యూనిఫామ్స్ ఉంటాయి.
 అలాగే అందరూ కలిసి మెలిసి మధ్యాహ్న భోజన సమయంలో ఆహారాన్ని తీసుకుంటారు.

 చదువుకునే సమయంలో ఆటల సమయంలో అందరూ కలిసి మెలిసి ఆడుకోవడం సమానత్వ భావనను పెంపొందిస్తుంది.

17.ఉమ్మడి జాబితా లోని రెండు అంశాలు  ఉదా లివ్వండీ?

వివాహాలు . విడాకులు  పౌర విచారణ స్మృతి  శిక్షాస్మృతి  ,విద్య  మొదలగునవి.

18.మానవతా విశ్వసూత్రం  ఆధారంగా ఏ దేశ రాజ్యాంగం రూపకల్పన  చేశారు?

 మానవతా విశ్వ సూత్రం ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన దేశం జపాన్.

19.రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాలు ఏవి? తెల్పుము?.

రాజ్యాంగ సభ చేసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా
 1.కేంద్ర అధికారుల సంఘం.
2 కేంద్ర రాజ్యాంగ సంఘం .
3.రాష్ట్ర రాజ్యాంగ సంఘం.
 4ప్రాథమిక హక్కులు .
5.అల్పసంఖ్యాక వర్గాలు.
 6.గిరిజన ప్రాంతాలు .
వంటివాటిపై సలహా సంఘాలను ఏర్పాటు చేశారు
20. దేశఐక్యత కాపాడటానికి ముసాయిదా రాజ్యాంగ మూడు ముఖ్య విధానాలు ఏవి?

భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం భారతదేశ ఐక్యతను కాపాడేలా రూపకల్పన చేశారు ఇందుకుగాను రాజ్యాంగంలో మూడు విధానాలు అనుసరించారు 

1 ఒకే   న్యాయవ్యవస్థ .
2 పౌర నేర అంశాలలో మౌలిక చట్టాలలో సారూప్యత 

3 ముఖ్యమైన పదవులలో నియమించడానికి దేశమంతటికీ అఖిలభారత సివిల్ సర్వీసులు వ్యవస్థను నెలకొల్పారు.

21. లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?

 నేపాల్ దేశం రాజ్య ప్రవేశిక పేర్కొంది .

22.శాంతి  కాముకత ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది ?

జపాన్ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.


11, నవంబర్ 2020, బుధవారం

జాతీయోద్యమం

 ప్రశ్నల సమాధానములు నిధి.


1.జాతీయోద్యమం  అంటే ఏమిటి?

భారత స్వాతంత్ర పోరాటంలో సామాన్య ప్రజానీకం నుండి సంస్థానాల రాజులు వరకు ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినందున దీన్ని జాతీయ ఉద్యమం అంటారు.


2. ముస్లిం లీగ్  పార్టీ గురించి తెల్పుము?

ముస్లింలీగ్ పార్టీని 1906 సంవత్సరంలో స్థాపించారు. .
ఇది ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ . ఈ లీగ్ కృషివల్ల  1909వ సంవత్సరంలో  ముస్లిం   ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి .
పార్టీకి 1930 వరకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లేదు. 1937లో ముస్లిం పార్టీ 102 స్థానాలను గెలుచుకుంది 
1940 నుండి  ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది.
1946లో రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో విజయభేరీ మోగించింది. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినం నిర్ణయించింది అనేక చోట్ల మతపరమైన దాడులు చెలరేగాయి

3.క్యాబినెట్ మిషన్  లోని సభ్యులు ఎవరు?
కేబినెట్ మిషన్ లోని సభ్యులు lord penthik Lawrence, sir Stafford cripps, A.V.Alexander .

4.బ్రిటీష్ ఇండియా లో  మొదటి ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలలో ,ఎప్పుడు నిర్వహించారు?

బ్రిటిష్ ఇండియాలో మొదటి ఎన్నికలు 11 రాష్ట్రాలలో   1937 సంవత్సరంలో నిర్వహించారు. 11 రాష్ట్రాలకు ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

5.వ్యక్తిగత సత్యాగ్రహం అంటే ఏమిటి?

స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు మొదలైన వాటితో నిమిత్తం లేకుండా వ్యక్తులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జాతీయ నాయకులు  ఒక్కొక్కరు  వ్యక్తిగతంగా జైలుకు వెళ్లార. దీనిని వ్యక్తిగత సత్యాగ్రహం అంటారు.

6.స్వాతంత్య్ర ఉద్యమం లో హిందూ మహాసభ,  (R. S. S). రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఏమిటీ?

స్వాతంత్ర ఉద్యమంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయినా ఆర్ ఎస్ ఎస్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పని చేశాయి .
కులం వర్గాలను అధిగమించి హిందువులు అందరినీ ఏకం చేసే సామాజిక జీవితంలో సంస్కరణ తీసుకురావాలని ఇవి ప్రయత్నించాయి. ఈ సంఘ కార్యకలాపాలలో అనేకమంది కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రభావితమయ్యారు
ఆర్ ఎస్ ఎస్ వల్ల ముస్లిం ప్రజల్లో కొంత అభద్రతా భావం ఏర్పడింది.


7." విభజించు పాలించు"అన్న విధానాన్ని వ్యాఖ్యానిo చండి? .

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో అనుసరించినా విధానాన్ని విభజించు పాలించు అంటారు ఈ విధానం లో (విభిన్న ప్రాంతాలుభిన్న ప్రాంతాలు, మతాలూ,మతాలు  తెగల  మధ్య  బేధాభిప్రాయాలు  నెలకొల్పడం) భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం మైనార్టీ వర్గాల మధ్య విభేదాలను సృష్టించి మతకలహాలకు కారణమయింది ఇలాంటి విధానాలను అవలంబించి భారతదేశాన్ని మరికొంత కాలం పరిపాలన చేయాలనేదే బ్రిటిష్ వారి అభిమతం

8.ముస్లిం లీగ్ పార్టీ వల్ల జరిగిన రాజకీయ పరిణామాల ఏమిటి?
R

9.ప్రత్యేక నియోజకవర్గాల విశేషం ఏంటి?

భారతదేశంలో 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు లో భాగంగా మత ప్రాతిపదికన ముస్లింలకు కొన్ని స్థానాలను ప్రత్యేకంగా రిజర్వు చేయడాన్ని ప్రత్యేక నియోజకవర్గం అంటారు.

 Q.కమ్యూనల్ అవార్డ్ అనగా నేమి?

భారతీయ సమాజాన్ని కుల ప్రాతిపదికన విడదీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కమ్యూనల్ అవార్డ్ లేదా ప్రత్యేక నియోజకవర్గాలు. దీన్ని ప్రతిపాదించినది రామ్సే మెక్డొనాల్డ్
 ఇందులో లో దళిత వర్గాలకు ప్రత్యేక ఏలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గాంధీ అంబేద్కర్ పూనా ఒప్పందం ద్వారా దీనిని  రద్దు చేయడమైనది .గాంధీజీ సంయుక్త  ఏ లెక్టరేట్  
ప్రతిపాదించారు.

10.క్రిప్స్ రాయబారo విశేషాలు ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ సైన్యం యొక్క  ప్రజల  ల యొక్క మద్దతు కోరుతూ భారత జాతీయ నాయకులతో 1942 వ సంవత్సరంలో   sir Stafford cripps నాయకత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని   cripps రాయబారం ఉంటారు
ఈ సమావేశం తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని క్రిప్స్ ప్రకటించారు.


11.క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్యాఖ్యానిo చండి?

క్రిప్స్ రాయబారం విఫలం అయిన తర్వాత 1942లో ఆగస్టు లో కాంగ్రెస్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది దేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టాలని ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఈ ఉద్యమంలో నే గాంధీజీ గారు "డూ ఆర్ డై "అనే నినాదం ఇచ్చారు .
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకం నుండి విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా దేశవ్యాప్త ఆందోళన చేపట్టడం జరిగింది ఇందులో బ్రిటిష్ వారి ఫ్యాక్టరీలలో కళాశాలలో పోలీస్ స్టేషన్లు పోస్ట్ ఆఫీసులు రైల్వే స్టేషన్లు లలో సమ్మె చేయడం జరిగింది

12. జాతీయోద్యమం లో భారత జాతీయ సైన్యం పాత్ర ( I.N.A.)ను పేర్కొనుము?

 ఐ .ఎన్ .ఏ . అనగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ సైన్యాన్ని కి  కి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించడం జరిగింది జపాను సహాయంతో భారత్లోని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారత జాతీయ సైన్యం పోరాడాల్సింది .దీని ప్రధాన కార్యాలయం రంగూన్ ,సింగపూర్ లో స్థాపించారు. ఈ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ "చలో ఢిల్లీ ""  జైహింద్ "అని నినాదాలు ఇచ్చారు.
 రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఆయన వ్యూహాలు విఫలమయ్యాయి.


13. స్వాతంత్ర్యం తర్వాత బా రత దేశం లో విలీనం ఐన సంస్థానాలు ఏవి,?

భారతదేశంలో  సంస్థానంలో విలీనం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.

 స్వాతంత్రం తర్వాత భారతదేశం లో విలీనమైన సంస్థానాలు .
కాశ్మీర్,  హైదరాబాద్,  జునాగఢ్.

1947 సంవత్సరం లో పాకిస్తాన్ కాశ్మీర్  పై దండెత్తినప్పుడు కాశ్మీర్ రాజు భారతదేశంలో విలీనం కావడానికి భారత దేశంలో విలీనం కావడానికి అంగీక రించారు.

హైదరాబాద్ సంస్థానాన్ని పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది .

జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశంలోకి కలవడం జరిగింది.

14."తెభాగ" ఉద్యమం అంటే ఏమిటి?

బెంగాల్ లో భూస్వాముల నుంచి భూమిని సాగు తీసుకున్న రైతులు కౌలు పరిమాణం మూడింట రెండు వంతులు పెంచాలని ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమాన్ని తెభాగ
ఉద్యమం అంటారు


15. సంస్థానాలు విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ను పేర్కొనండి? 

భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడు సుమారు 550 పైగా సంస్థానాలకు కూడా స్వాతంత్రం ప్రకటించడం జరిగింది .ఈ సంస్థానాలు భారతదేశంలో లో నైనా పాకిస్తాన్ లోనైనా లేదా స్వతంత్రంగా అయినా ఉండడానికి అవకాశం ఇచ్చారు.

స్వతంత్రం తర్వాత సంస్థానాల విలీనం ఆ బాధ్యత భారత మొదటి హోం శాఖ మాత్యులు "సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఉంచడం జరిగింది వీటిని ఆయన చాలా చాకచక్యంగా భారతదేశంలో విలీనం చేశారు. అయితే జునాగఢ్, హైదరాబాద్ ,కాశ్మీర్ సంస్థానాలు .విలీనం కాలేదు వీటిని స్వాతంత్రం తరువాత ప్రత్యేక చర్యల ద్వారా భారతదేశంలో కలిపారు జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశం లో కలవడం జరిగింది హైదరాబాద్ పోలీసు చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేశారు కాశ్మీర్ పై పాకిస్తాన్ దండెత్తడం తో కాశ్మీరు రాజు భారతదేశంలో విలీనానికి అంగీకరించారు

16.భా రత దేశ విభజన కు దారి తీసిన వివిధ కారణాలు  తెలపండి?

బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అనుసరించినా విభజించు పాలించు అనే విధానం .
భారతదేశానికి విభజనకు దారి తీసింది .

ముస్లిం మైనార్టీల లో అభద్రతా భావం .

ముస్లింలీగ్ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వం లో చేరిన ప్రభుత్వ పరిపాలన సరైన సహకారం అందించకపోవడం.

ముస్లిం లీగ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ ప్రయత్నాలు విఫలం కావడం

 ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినం జరపడం .మతకలహాలు మతకలహాలు .
మహమ్మద్ ఇక్బాల్ లాంటి కవులు కూడా పాకిస్తాన్ అనే భావనను సమర్థించడం.

 ఈ కారణాల వల్ల భారతదేశం పాకిస్థాన్ రెండుగా విడిపోయింది

17.స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీజీ పాత్ర ఏమిటి?

గాంధీజీ భారతదేశానికి 1915 వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి రావడం జరిగింది.
1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి సత్యం అహింసల పై ఆశ్రమాన్ని నడిపారు 1917 బీహార్ లోని చంపారన్ రైతుల సత్యాగ్రహం నిర్వహించి విజయవంతం అయ్యాడు 1919 సంవత్సరం లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ సంఘటన కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించారు .1920 -22 సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి "సత్యం  అహింస "అనే సిద్ధాంతాలతో భారత దేశానికి స్వాతంత్రం తీసుకు రావడం జరిగింది

18.సుభాష్ చంద్రబోస్ లో మీకు నచ్చిన  గుణాలు ఏవి? ఎందుకు?

భారత జాతీయోద్యమ నాయకుడు లో సుభాష్ చంద్ర బోస్ ముఖ్య నాయకుడు విదేశాలలో(ఐ ఎన్ ఏ అనే సైన్యాన్ని) భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై అత్యంత సాహసోపేతంగా యుద్ధాన్ని ప్రకటించారు.
ఈయన  సైన్యాన్ని అజాద్ హింద్ ఫౌజ్ అంటారు. నినాదాలు "చలో ఢిల్లీ" జై హింద్"

19(.డొమినియన్) రాజ్య ప్రతిపత్తి అంటే ఏమిటి?

భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం కాకుండా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండే స్వాతంత్రాన్ని ఇవ్వడం.


20.దేశవిభజన లో  మౌంట్ బాటెన్ విధానాలు పేర్కొనండి?

1947 ఫిబ్రవరి లో వావేల్ లో స్థానం లో వైస్రాయ్ గా మౌంట్ బాటెన్ వచ్చారు .అప్పటికి భారత దేశంలో లో కాంగ్రెస్ ముస్లింల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి 

మౌంట్ బాటన్ మరోసారి కాంగ్రెస్ ముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశారు .
కానీ విఫలమయ్యాయి విఫలమయ్యాయి .

.దాంతో 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించి ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని పాకిస్తాన్ ను విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు

 ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ముస్లింలీగ్ అంగీకరించాయి.




💐💐💐💐💐💐💐💐💐
            💐💐💐💐.

8, నవంబర్ 2020, ఆదివారం

వలస పాలిత ప్రాంతాల లో లో జాతి విముక్తి ఉద్యమాలు

 

               ప్రశ్నల సమాధానములు నిధి.

1 వలస పాలిత దేశాలు అంటే ఏమిటి?

ఒక దేశం మరొక దేశం యొక్క పరిపాలన నియంత్రణలో ఉంటే అటువంటి దేశాలను వలస పాలిత దేశాలు అంటారు .
ఉదా: ఇంగ్లాండ్ యొక్క వలస పాలిత దేశం ఇండియా


2.జాతీయత భావం అంటే ఏమిటి?

ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగి ఉన్న దాన్ని జాతీయత అంటారు

3.ప్రజాస్వామ్యo అంటే ఏమిటి?

ప్రజాస్వామ్యం అనగా ప్రజా పరిపాలన అని అర్థం డెమోక్రసీ అనే ఆంగ్ల పదo " డెమో స్ "  "క్రే షియా " అనే రెండు గ్రీకు  పదాల కలయిక  కలయిక వల్ల  వల్ల ఏర్పడినది .
 demos అనగా ప్రజలు.
 "క్రేషియా "అనగా పరిపాలన.
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ నిర్వహించడాన్ని ప్రజాస్వామ్యం అంటారు

4. నైజీరియా జాతీయవాద ముందు ఉన్న రెండు సమస్యలు ఏవి?

  1.బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం .2.ఘర్షణ పడుతున్న వివిిిిిిిిిిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.




5.సన్ యేట్ సేన్ మూడు సిద్దాంతాలు ఏవి?

 సన్ యేట్ సేన్ 3 సిద్ధాంతాలు  ("son "min """chui")

ఇవి ఏమనగా 
1.జాతీయవాదం ;:-అంటే విదేశీ పాలకుల గా భావించబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్య శక్తులను తొలగించడం .
2.ప్రజాస్వామ్యం::- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
3.సామ్యవాదం::- అంటే పరిశ్రమలపై నియంత్రణ భూమి లేని రైతాంగానికి  భూమి పంచడం.

6.యుద్దప్రభువులు అంటే ఎవరు?

చైనాలో స్థానిక సైనిక నాయకులను యుద్ధ ప్రభువులు అని పిలిచేవారు

7.".మే నాలుగు ఉద్యమం "ను వివరించండి?


1919 may 4. బీజింగ్లో లో ఒక నిరసన ప్రదర్శన ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడినప్పటికీ జపాన్ పొందిన విభాగాలను చైనా తిరిగి పొందలేకపోయింది దీన్ని నిరసిస్తూ మే 4 1919 న చేపట్టిన ఉద్యమాన్ని మే 4 ఉద్యమం అంటారు
ఇందులో లో  ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రజాస్వామ్యం జాతీయవాదం  ద్వారా  ముందుకు వెళ్లాలని విదేశీయులను తరిమివేయాలని పేదరికాన్ని తగ్గించాలని మహిళల పరాధీనత ఆడపిల్లల పాదాల కట్టివేయడం వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.

8."సియావో షిమిన్" అనగానేమి?.

చైనాలో మధ్యతరగతి పట్టణ ప్రజలను సియావో షిమిన్ అంటారు

9.సోవియట్లు అంటే ఏమిటి?

రష్యాలో ఉండే స్థానిక రాష్ట్రాలను సోవియట్ లు అంటారు.
రష్యా విప్లవం కంటే ముందు ఏర్పడిన కార్మిక కర్షక సంఘాలను సోవియట్ లు అంటారు.


10.లాంగ్ మా ర్చ్ అనగానేమి?

చైనాలో కమ్యూనిస్టులు( రెడ్ ఆర్మీ ) 6000 కిలోమీటర్ల సైనిక  కవాతు నిర్వహించడాన్ని లాంగ్ మార్చ్ అంటారు.

11.భూసంస్కరణలు అంటే ఏమిటి?
పెద్దపెద్ద భూస్వాములు నుండి భూమిని సేకరించి పేద ప్రజలకు పంచి పెట్టడాన్ని
భూసంస్కరణలు అంటారు. 

12.వియత్నాం వలస పాలన అను భవం వివరించండి?


13. వియత్నాం భూ సంస్కరణలు తీరు తెలపండి?

వియత్నాంలో 1945 ఆగస్టు లో హోచిమిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిక అవును 25 శాతం తగ్గించారు మారు కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు కౌలుదార్లకు మాఫీ చేశారు వియత్నాం విద్రోహుల భూమిని పంచ సాగారు

భూసంస్కరణల తో  1954లో ఉత్తర వియత్నాం లో కొత్త యుగం మొదలయ్యింది .
భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పేద రైతులకు భూమి పంచిపెట్టారు .
రైతుల కలలు నిజం చేయడంలో లో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది
 కాబట్టి రైతులకు మద్దతు పూర్తిగా ప్రభుత్వాలకు లభించింది.

14 .వియత్నాం ప్రధాన ఎగుమతులు ఏవీ?

వియత్నాం ప్రధాన ఎగుమతులు వరి రబ్బర్ పంటలు

15.వియత్నాం రైతాంగం  సమస్యలు పేర్కొనండి?

వియత్నాం దేశం ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలన కింద దశాబ్దాలపాటు ఉండడంవల్ల సామాన్య రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది .

.భూమి లేకపోవటం .
అధిక కౌలు పరిమాణం ఉండటం .
అధిక వడ్డీ భారం కింద రైతాంగం నలిగిపోవడం వెట్టి కార్మికులుగా చేయడం .
వంటివి వియత్నాం రైతాంగం ఎదుర్కొన్నది

16.వియత్నాం లో జాతీయతావా దం ఎలా విస్తరించింది? వివరించండి?

I .వియత్నాంలోను స్థానికులను నాగరికులుగా చేయడానికి విద్య ఒక మార్గంగా భావించారు .

ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు విద్యార్థులు గుడ్డిగా అనుసరించకుండా కొన్నిసార్లు బహిరంగంగా మౌనంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండేవారు.
 టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాఠాలు బోధించేవారు.
 దేశ భక్తి భావంతో సమాజ ప్రయోజనాల కోసం పోరాడటం విద్యావంతుల విధి అని బోధించేవారు 
20వ శతాబ్దంలో ఆరంభంలో  ఆధునిక విద్య కోసం వియత్నాం విద్యార్థులు జపాన్ కి వెళ్లారు.
 ఫ్రెంచ్ వాళ్లను తరిమివేయడం కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి అంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడం ముఖ్య విధిగా జాతీయ భావంతో పని చేశారు.


17 .ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి?

ఏజెంట్  ఆరెంజ్ అత్యంత విష పదార్థం ఇది ఆకులు రాలి పోయేలా చేసి మొక్కల్ని చంపే విషం

18.నై జీరియా గిరిజన జాతులు ఏవి?

నైజీరియాలో "హౌసా పులానీ " ఈ ప్రజలు ఉత్తర భాగంలో అధికంగా ఉండేవారు అదేవిధంగా  లో ఆగ్నేయ భాగంలో లో" ఈ బో తెగ ""నైరుతి భాగంలో" యరు బా".

19.ఖండాం త ర ఆఫ్రికా వాదం అంటే ఏమిటి?

దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడానికి ఖండాంతర ఆఫ్రికా వాదం అంటారు దీన్ని సాధించడానికి కృషి చేసిన వ్యక్తి  కామెన్ క్రుమా..



20.వియత్నాం నూతన గణతంత్ర వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ల ను పేర్కొనండి?

21.చైనా, వియత్నాం, భారత దేశాలలో ని భూ సంస్కరణలు ను పోల్చండి?

చైనా దేశంలో 1950లో భూసంస్కరణల అమలు పెట్టారు గ్రామాలలో ఉన్న ప్రజలను గుర్తించి భూస్వాముల భూముల స్వాధీనం చేసుకుని పంచడం మొదలుపెట్టారు ప్రాం తీయ స్థాయిలో భూ సంస్కరణల సంఘం కీలక పాత్ర పోషించింది చైనా 43 శాతాన్ని గ్రామీణ ప్రజలు 60 శాతానికి పంచిపెట్టడం లో భూసంస్కరణలు విజయం సాధించాయి.

వియత్నాంలో 1954 తర్వాత భూస్వాముల భూముల స్వాధీనం చేసుకొని భూమి లేని రైతాంగానికి పంచి పెట్టడం జరిగింది రైతుల కలలు నిజం చేయడంలో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది..

భారతదేశంలో  నెహ్రూ ప్రభుత్వం  3 రకాల   భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది .

1.జమిందారీ వ్యవస్థ .
2కౌలు విధానాల సంస్కరణ.
3. భూ పరిమితి విధానాలు .

దున్నేవాడిదే భూమి  అనే లక్ష్యంతో  భూసంస్కరణలు ప్రారంభించారు అయితే పూర్తిస్థాయిలో భారతదేశంలో భూసంస్కరణలు  అమలు కాలేదు

22.వియత్నాం లో అమెరికా జోక్యం  ఎందుకు చేసుకున్నది?

తమ శత్రువులైన కమ్యూనిస్టుల ప్రాబల్యం వియత్నాంలో పెరుగుతున్నందున ఆందోళన చెంది అమెరికా వియత్నాంలో యుద్ధానికి దిగింది

23.నాపాలం బాంబు అంటే ఏమిటి?

మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబును నాపాలం బాంబు అంటారు.

24.నైజీరియాలో చమురు, పర్యావరణo,రాజకీయాల  ప్రభావాన్ని  తెల్పుము?.

డెల్టాలో 1950లో ఎవరు కనుగొన్నారు చమురుకనుగొన్నారు  డ చ్ సెల్ కంపెనీలు ఆధ్వర్యంలో వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి.
 చమురు వెలికి తీసి తమ లాభాల్లో కొంత సైనిక పాలకులకు అందించాయి.
 సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా యదేచ్ఛగా చమురు వెలికి తీయడం వల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి .
జీవావరణ వ్యవస్థ దెబ్బతిని మడ అడవులు అంతరించాయి. దీంతో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలను (క్యాన్సర్ లాంటి వ్యాధులు)  ఎదుర్కోవలసి వచ్చింది .

💐💐💐💐💐💐💐💐

7, నవంబర్ 2020, శనివారం

నివాస ప్రాంతాలు వలసలు

 

నివాస ప్రాంతాలు- - వలసలు.

1.నివాసప్రాంతం అంటే ఏమిటి?

ఒక ప్రదేశంలో మనం నివసించడానికి అనుకూలంగా ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని నివాస ప్రాంతం అంటారు.

2.విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి?

పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడిన నివాసయోగ్యమైన నగరాలను విమానాశ్రయ నగరాలు అంటారు.

3.పట్టణీ కరణ అనగానేమి?

పట్టణ జనాభాలో పెరుగుదల నే పట్టణీకరణ అని అంటారు పట్టణాలలో లో జనాభా వల్ల అనేక సమస్యలు ఉత్పన్న మగును

4.వలస అనగా నేమి?

సాధారణంగా గా ప్రజలు ఉపాధి కోసం, విద్య కోసం ,మెరుగైన టువంటి జీవితం కోసం, ఉన్న ప్రాంతాల నుంచి వేరొక ప్రాంతాలకు పోవడాన్ని వలసలు అంటారు.

5.నివాస ప్రాంతాలు యొక్క మౌలిక విషయాలు ఏవి?

నివాస ప్రాంతంలో మౌలిక విషయంలో   ప్రదేశం orస్థలము .పరిస్థితి  ఆ ప్రదేశం యొక్క భౌతిక స్థితి ప్రదేశం యొక్క చరిత్ర  అనేవి మౌలిక విషయాలు గా పరిగణిస్తారు

6.మహా నగరాలు అంటే ఏమిటి?

  కోటి జనాభాకు మించి ఉన్న నగరాలను మహానగరాలు అంటారు .ఉదా. ముంబై ,ఢిల్లీ.

7.మెట్రో పాలిటన్ సిటీ అంటే ఏమిటి?

10 లక్షల నుండి  కోటి జనాభా ఉన్న నగరాలను మెట్రో నగరాలు అంటారు వృధా ఉదా .కలకత్తా చెన్నై ,హైదరాబాద్ ,అహ్మదాబాద్

8.క్లాస్ 1 నగరాలు అంటే ఏమిటి?

ఒక లక్ష నుండి  10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను క్లాస్ వన్ నగరాలు అంటారు

9.పట్టణం అనగానేమి?

5000 వేల నుండి ఒక లక్ష మధ్య ఉన్న జనాభా ఉన్న పట్టణాలను పట్టణo అంటారు

10.రెవెన్యూ గ్రామము అంటే ఏమిటి?

 నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాన్ని రెవెన్యూ గ్రామం అంటారు

11.ఆవాస ప్రాంతం అంటే ఏమిటి?

 రెవెన్యూ గ్రామం లోపల ఉండే కొన్ని నివాస ప్రాంతం సముదాయాలనుమ హమ్లెట్ లేదా  ఆ వాసప్రాంతం అంటారు

12.అంతర్గత వలస అంటే ఏమిటి?

దేశంలోని రాష్ట్రాల మధ్య లేదా ప్రాంతాల మధ్య  జరిగే వలసలను అంతర్గత వలసలు అంటారు .

13.అంతర్జాతీయ వలస అంటే ఏమిటి?

ఒక దేశం నుండి  మరొక దేశానికి జరిగే వలసలను అంతర్జాతీయ వలసలు అంటారు ఉదా .ఇండియా నుండి అమెరికా,
 ఇండియా నుండి బ్రిటన్

14.అంతరాష్ట్ర వలస అంటే ఏమిటి?
రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఒక జిల్లా నుండి మరొక జిల్లా లేదా అలా ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలోకి జరిగే వలసలను  అంతర్రాష్ట్ర వలసలు అంటారు.


15.కాలానుగుణ వలస అంటే ఏమిటి?
 భూమి లేని వ్యవసాయ కూలీలు సాధారణంగా వ్యవసాయ పనుల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యవసాయ కూలీలుగా కాలానుగుణంగా వెళ్తూ ఉంటారు అటువంటి వలసలను వలసలు అంటారు

16.ఏరోట్రోపొలిస్  నగరాలు(విమానశ్రయ నగరాలు) అంటే ఏమిటి?

ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధి చెందుతూ ఉండటంవల్ల పెద్ద పెద్ద విమానాశ్రయాలకు చుట్టూ కూడా నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అటువంటి నగరాలను విమానాశ్రయ నగరాలు అంటారు.

17.వలసలు గుర్తింపు ప్రామాణికాలు ఏంటి?

ఒక వ్యక్తిని వలస వెళ్లిన వారి గా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు రెండు రకాల ప్రామాణికాలను ఉపయోగిస్తారు .
:1 జన్మస్థానం : ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం .
2 ఇంతకుముందు నివాసమున్న స్థలం: ఒక వ్యక్తి ఆరునెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఉన్న ప్రదేశం

18.పట్టణీకరణ వలన ఏర్పడే సమస్యలు ఏమిటి?

పట్టణాల పెరుగుదల వల్ల అనేక సమస్యలు ఏర్పడును 1 మురుగు నీటి పారుదల సమస్య 2. జనాభాకు సరిపడా గృహ వసతి లేకపోవడం 3జనాభాకు అనుగుణంగా విద్యుత్ నీరు, రవాణా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు వంటివి ,కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి .
4.
వాహనాలు అధికంగా వినియోగం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడును.
5 వాహన కాలుష్యం పెరుగును 6.త్రాగునీటి కొరత ఏర్పడును .
7.రోడ్ల విస్తరణ చేయవలసి ఉంటుంది


19.తాత్కాలిక వలస అంటే ఏమిటి?

వ్యక్తులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేక ఉపాధి కోసం కొలతలు వెళ్తూ ఉంటారు .
అయితే జనాభా లెక్కల ప్రకారం 6 నెలలు కంటే తక్కువ వలస వెళితే అటువంటివారిని తాత్కాలిక వలసలు అంటారు

20. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల? వివరించండి?

1.గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేక పోవడం. 2.మెరుగైన జీవన వసతి కోసం .
గ్రామీణ ఉపాధి లో తగినంత ఆదాయం లేకపోవడం
3.పట్టణాలలో విద్య వైద్య ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండడం .
4.ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో అధికంగా ఉండడం.
 5.మౌలిక వసతులు లభించడం .ఉపాధి అవకాశాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఉండటం .వల్ల 
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు

21.పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో ఉపాది అవకాశా లు ఎక్కువ? కారణాలు పేర్కొనండి?

పట్టణ ప్రాంతాలలో  పారి శ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ .
సేవా రంగంలో కూడా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల కు ఉపాధి అవకాశాలు ఎక్కువ.

పట్టణాల్లో బిల్డింగుల నిర్మాణంలో  రోడ్ల 

నిర్మాణం లోనూ  మురికి కాలువల నిర్మాణం 

లోనూ వ్యాపార వాణిజ్య  కార్యకలాపాలలో కూడా ఎక్కువ అ ఉపాధి అవకాశాలు లభించును.

22.గ్రామీణ ప్రాంతాల్లో ని వలసల వల్ల ఏ రంగం ఆర్థికం గా దెబ్బ తింటుంది? ఎందువల్ల?

గ్రామీణ ప్రాంతాలలో వలసల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా  నష్టపోవడం  జరుగును.
వ్యవసాయ రంగంలో లో కూలీలు కొరత ఏర్పడును.
వ్యవసాయ రంగంలో పెట్టుబడుల కొరత ఏర్పడును
వ్యవసాయ రంగంలో లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లోపించడం ఉత్పత్తి ఉత్పాదకత దెబ్బతినడం వంటివి జరుగును


23.వలస  వెళ్ళిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?
1 భాషా సమస్య ఏర్పడును .
2.మురికి  వాడలలో నివాసం .
3.తీవ్రమైన నా పరిస్థితుల్లో నివసించడం.
4. ఆహార ధాన్యాలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం .
5.పిల్లలకు విద్య అందుబాటులో లేకపోవడం 6.కుటుంబం యొక్క బాధ్యతలు.
 వృద్ధుల సంరక్షణ సమస్యలు ఏర్పడును 7.అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యుల అందుబాటులో లేకపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

24.వలస వెళ్ళిన ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ చర్యలు చేపట్టాలి?పేర్కొనండి? 

వలస వెళ్లిన ప్రజలకు విద్య వైద్యం  అందుబాటులో ఉండేటట్టు చూడాలి
. మెరుగైన రవాణా వసతులు ఉండేటట్లు చూడాలి .
సరి అయిన తాగునీటి ఏర్పాట్లు ఉండాలి .

గృహవసతి లాంటి ఏర్పాట్లు ఉండాలి ..

పనిచేసే ప్రదేశాలలో సరైన సౌకర్యాలు ఉండాలి. పని ప్రదేశాలలో లో పని వేతనాలు  సక్రమంగా అందేటట్లు చూడాలి .
ఎటువంటి వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలి.

25."పట్టణీకరణ అభివృద్ధికి చిహ్నం గా భావిస్తున్నారు"కారణం ఏమిటి? వివరించండి?

పట్టణాలలో మెరుగైన మౌలిక వసతులు రోడ్లు రవాణా సౌకర్యాలు విద్య వైద్యం అందుబాటులో ఉండటం వల్ల అభివృద్ధి భావిస్తూ ఉన్నారు .
అదే విధంగా పారిశ్రామిక సేవా రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడం అభివృద్ధికి చిహ్నం గా భావిస్తూ ఉన్నారు.
 జీవన ప్రమాణాలు అధికంగా ఉండటం వల్ల అభివృద్ధికి చిహ్నంగా  గా భావిస్తున్నారు.

26.భారత దేశ పటం లో నగరాలను గుర్తిచండీ?
1.చెన్నై 2.బెంగళూరు.3.హైదరాబాద్4.ఢిల్లీ 5.కలకత్తా,6భోపాల్ 7.ముంబై 8.కొచ్చిన్.

27 అంతర్గత ,అంతర్జాతీయ వలసల ప్రభావాలు మధ్య తేడాలను పేర్కొనండి?

 అంతర్గత వలసలు:  ఇవి ఇవి దేశంలోని రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య జిల్లాల మధ్య ఉంటాయి. 
ఇందులో లో ప్రభుత్వ  సహాయ సహకారాలు ఉండవు.
వృత్తి అనుభవం ఉన్న లేకున్నా కూడా పని లభించును. వృత్తి అనుభవం ఉన్నటువంటి వారికి నైపుణ్యం ఉన్నటువంటి వారికి అధిక వేతనాలు లభించును  
దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన నా దేశం లోనే ఉంటారు కాబట్టి దేశ సేవ గానే భావించవచ్చ 
అంతర్జాతీయ  వలసలు:- ఇవి 1 దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్లడం జరుగును .

అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా వలసలు ఉండే అవకాశం ఉంది.
 ఇందులో లో కొన్ని సార్లు ప్రభుత్వ జోక్యం అవసరం  .
విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశం ఉంది.
 నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లు వైద్యులు కార్మికులు ఇతర దేశాలలో సేవలను అందిస్తారు

28.అంతర్జాతీయ వలసలు వల్ల లాభమా ,నష్టమా , వివరించండి?
లాభాలు

అంతర్జాతీయ వలసల వల్ల విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి లభించడం లాభదాయకం అంతర్జాతీయ వలసల వల్ల విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి లభించును 
మన దేశం నుండి వలస వెళ్లే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం మన దేశంలో నిరుద్యోగం  తగ్గును

. నష్టాలు
మన దేశం నుండి విజ్ఞానాన్ని సంపాదించి ఇతర దేశాలకు సేవచేయడం వల్ల మనదేశంలో మేధో వలస వల్ల నష్టం జరుగును దీనిని బ్రెయిన్ డ్రైన్ అంటారు
మనదేశంలో ఉన్న నైపుణ్యం ఉన్నటువంటి  ఇంజనీర్లు కార్మికులు వృత్తి పనివారు డాక్టర్లు లు వ్యక్తులు ఇతర దేశాలలో సేవ చేయడం వల్ల మనదేశంలో ఉత్పత్తి ఉత్పాదకత తగ్గును.
పై రెండింటిని సమన్వయం చేసుకోగలిగే  తే మన దేశానికి లాభం చేకూర్చవచ్చు.


💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
  

4, నవంబర్ 2020, బుధవారం

జనాభా

జనాభా (ప్రశ్నలు సమాధానములు నిధి)

1.జనసాంద్రత అనగానేమి?

ఒక ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు తెలియజేసే దాన్ని జనసాంద్రత అంటారు .


2.లింగనిష్పత్తి అనగానేమి?

జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు కు ఎంత మంది స్త్రీలు ఉన్నారు తెలియజేసే దాన్ని లింగనిష్పత్తి అంటారు.


3.ఫెర్టిలిటీ శాతం అంటే ఏమిటి?

ఒక మహిళ  తన జీవిత కాలంలో లో  ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చింది తెలియజేయు శాతాన్ని ఏమంటారు.

4 .భౄణహత్య అనగానేమి?

గర్భంలో ఉన్న శిశువును గర్భంలోనే చంపడాన్ని భ్రూణహత్య అంటారు .

5.శ్రా మిక జనాభా అనగానేమి?

జనాభా సమూహంలో లో 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులను శ్రామిక జనాభా అంటారు.

6.జనాభా మార్పు ను  తెలియచేసే అంశాలను వివరించండి?

జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. 1.జననాలు, 2.మరణాలు .3వలసలు .
అనే మూడు ప్రక్రియల వల్ల జనాభా మార్పు కలుగుతుంది.


7.దేశ జనాభా ను ప్రధాన o గా ఎన్ని వర్గాలు గా విభజిస్తారు?

ఒక దేశ జనాభాను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు .

1 పిల్లలు (సాధారణంగా 15 సంవత్సరాల లోపు వారు) 
2. పని చేసే వయసు (15 నుండి 59 మధ్య వయస్సు) 
3. వృద్ధులు 59 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వాళ్ళు.

8.జన నాల రేటు అంటే ఏమిటి?

ఒక సంవత్సర కాలంలో ప్రతి వెయ్యి మంది జనాభా ఎంత మంది సజీవంగా జీవించి ఉన్నారో దానిని జననాల రేటు అంటారు.

9.మరణాలు రేటు అంటే ఏమిటి?

ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఎంత శాతం మంది మరణించారు తెలియజేసే దాని రేటు అంటారు.

10.జనాభా విస్తరణ అనగానేమి?

 జనాభా పెరుగుదల ఏ ఏ రాష్ట్రాలలో ఎంత ఉందో ఏ ప్రాంతాలలో ఎంత ఉందో తెలియజేసే దానిని జనాభా విస్తరణ అంటారు.

11.జనాభా పెరుగుదల అంటే ఏమిటి?

ప్రతి పది సంవత్సరాల కాలంలో జనాభా సంఖ్య పెరుగుదలను సూచించే దానిని జనాభా పెరుగుదల అంటారు.

12.జన గణన ద్వారా ఏమి తెలుసుకుంటారు?

దేశ జనాభాలో ఏ వయసు వారు ఎంత శాతం మంది ఉన్నారు.
శ్రామిక జనాభా ఎంత ఉంది .
జనాభాలో వృద్ధులు ఎంతమంది.
 ఎంత మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు.
 పారిశ్రామిక రంగం లో ఎంత మంది ఉన్నారు సేవా రంగంలో ఎంత జనాభా ఉంది.
  అక్షరాస్యులు  నిరక్షరాస్యులు.   మతం ,  గృహ సౌకర్యం ,ఎన్ని రకాల వృత్తులలో ఉపాధి పొందుతున్నారు .ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఇలాంటి అంశాలు సమాచారం సేకరించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ జనాభా సమాచారo సేకరించబడుతుంది.

13.వివిధ రాష్ట్రాల జనసాంద్రత లో తేడాలకు గల కారణాలు ఏంటి?

Ans.రాష్ట్రం యొక్క భూభాగం,
మైదానాలు,  అడవులు. కొండలు.
 పర్వతాలు, వార్షిక వర్షపాతం ,ఎడారులు సారవంతమైన నేలలు ,

మౌలిక వసతులు, విద్య వైద్య సౌకర్యాలు ,పట్టణీకరణ ,ఉపాధి అవకాశాల విస్తరణ .
వంటి అంశాలు .
వివిధ రాష్ట్రాలలో జనసాంద్రత లో తేడాలకు కారణం.

14.జనాభా పెరుగుదల కు గల  కారణాలు ఏంటి?

1బాల్య వివాహాలు.
2. విద్య వైద్య సౌకర్యాల అభివృద్ధి.
 .3.
ఉపాధి అవకాశాల పెరుగుదల ..4కరువుకాటకాల నిర్మూలన .5.మూఢనమ్మకాలు.
 6.కుటుంబ నియంత్రణ పాటించకపోవడం పుత్రసంతానం కోసం నిరీక్షణ మధ్య .
7.జననాల రేటు ఎక్కువ కావడం .
సంతానానికి సంతానానికి మధ్య అనంతరం లేకపోవడం ..
8.వరదలను నివారించుట.
 ఈ కారణాల వల్ల జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది

15.జనాభా పెరుగుదల అరికట్టేందుకు నీ సూచనలు తెల్పుము?

 1.అక్షరాస్యతను పెంపొందించడం.
 2.బాల్య వివాహాలను అరికట్టడం.
 3.కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడం .
4.విద్య వైద్య సంస్థలను అందుబాటులోకి తీసుకురావడం.
 5.మూఢనమ్మకాలను తొలగించడం .
6.అధిక సంతానం  అధిక భారం అని తెలియ చేయడo.
 7.పురుషులైనా స్త్రీలైనా సమానమనే అనే భావన కలిగించడం
 8.కుటుంబం పరిమిత కుటుంబం వల్ల కలిగే లాభాలను వివరించడం.
 9.జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందని తెలుపడం.
 ఈ చర్యల ద్వారా జనాభాను అరికట్టవచ్చు

16.జనాభా సమస్య నివారణకు నినాదాలు వ్రాయండి?

A.అధిక జనాభా- అనర్థాలకు హేతువు.
 B.చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం.
 C.అధిక జనాభా -ఆహార కొరత కు కారణం..
 D.పరిమిత కుటుంబం ప్రగతికి సోపానం

17. లింగనిష్పత్తి లో అసమానతలు ఏ విదంగా తగ్గించవచ్చు?తెల్పుము?

1.అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా 2.పురుషులు స్త్రీలు సమానం అనే భావనను వృద్ధి చెందడం ద్వారా.
3. పురుషాధిక్యతను తగ్గించడం.
4. పురుషాధిక్య తను తగ్గించడం ద్వారా 5.మహిళా అక్షరాస్యతా పెంపొందించడం ద్వారా.
6. చట్టాల రూపకల్పన మరియు పటిష్ఠంగా అమలు చేయడం చేయడం ద్వారా.


18. శ్రామిక జనాభా అని ఎవరిని అంటారు?

 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారిని శ్రామిక జనాభా అంటారు వీరు వివిధ రకాల వృత్తుల లో పాల్గొని ఉత్పత్తి కార్యక్రమాలు చేపడతారు

19.అంతర్గత వలసలు అనగానేమి?
దేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా వివిధ ప్రాంతాల మధ్య జరిగే వలసలను అంతర్గత వలసలు అంటారు

20.అంతర్జాతీయ వలసలు అనగానేమి?

ఒక దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని అంతర్జాతీయ వలస అంటారు.


21.తెలంగాణలోని ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ ఉంది దానికి గల కారణం ఏమిటి?

తెలంగాణలో అత్యధికంగా మౌలిక సదుపాయాలు  అభివృద్ధి చెందిన ప్రాంతంలో జన సాంద్రత అధికంగా ఉంటుంది.
 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాబట్టి అక్కడ జీవన సదుపాయాలు పారిశ్రామిక కేంద్రాలు , విద్య  వైద్య కేంద్రాలు ,ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రం లోని  వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి కి  వలస వచ్చి అక్కడ స్థిరపడటం వల్ల అధిక జనసాంద్రత కేంద్రీకృతమై ఉంది .

22.లింగనిష్పత్తి లో ఎక్కువ ,తక్కువ, ఉంటే సమాజం పై పడే ప్రభావం ను పేర్కొనండి?.

 లింగ నిష్పత్తి లో తేడాలవల్ల సమాజంలో సామాజిక దుష్పరిణామాలు లేదా అరాచకాలు జరిగే అవకాశాలు ఏర్పడును.
 వివాహం కావలసిన వారి మధ్య  పురుషులకు స్త్రీలు ,స్త్రీలకు పురుషులు ,తగినంత లభ్యం కాకపోవచ్చు .
లింగ నిష్పత్తి జననాల రేటు ను ప్రభావితం చేస్తుంది .
సామాజిక అసమానతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

💐             💐                   💐