Translate

8, నవంబర్ 2020, ఆదివారం

వలస పాలిత ప్రాంతాల లో లో జాతి విముక్తి ఉద్యమాలు

 

               ప్రశ్నల సమాధానములు నిధి.

1 వలస పాలిత దేశాలు అంటే ఏమిటి?

ఒక దేశం మరొక దేశం యొక్క పరిపాలన నియంత్రణలో ఉంటే అటువంటి దేశాలను వలస పాలిత దేశాలు అంటారు .
ఉదా: ఇంగ్లాండ్ యొక్క వలస పాలిత దేశం ఇండియా


2.జాతీయత భావం అంటే ఏమిటి?

ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగి ఉన్న దాన్ని జాతీయత అంటారు

3.ప్రజాస్వామ్యo అంటే ఏమిటి?

ప్రజాస్వామ్యం అనగా ప్రజా పరిపాలన అని అర్థం డెమోక్రసీ అనే ఆంగ్ల పదo " డెమో స్ "  "క్రే షియా " అనే రెండు గ్రీకు  పదాల కలయిక  కలయిక వల్ల  వల్ల ఏర్పడినది .
 demos అనగా ప్రజలు.
 "క్రేషియా "అనగా పరిపాలన.
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ నిర్వహించడాన్ని ప్రజాస్వామ్యం అంటారు

4. నైజీరియా జాతీయవాద ముందు ఉన్న రెండు సమస్యలు ఏవి?

  1.బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం .2.ఘర్షణ పడుతున్న వివిిిిిిిిిిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.




5.సన్ యేట్ సేన్ మూడు సిద్దాంతాలు ఏవి?

 సన్ యేట్ సేన్ 3 సిద్ధాంతాలు  ("son "min """chui")

ఇవి ఏమనగా 
1.జాతీయవాదం ;:-అంటే విదేశీ పాలకుల గా భావించబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్య శక్తులను తొలగించడం .
2.ప్రజాస్వామ్యం::- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
3.సామ్యవాదం::- అంటే పరిశ్రమలపై నియంత్రణ భూమి లేని రైతాంగానికి  భూమి పంచడం.

6.యుద్దప్రభువులు అంటే ఎవరు?

చైనాలో స్థానిక సైనిక నాయకులను యుద్ధ ప్రభువులు అని పిలిచేవారు

7.".మే నాలుగు ఉద్యమం "ను వివరించండి?


1919 may 4. బీజింగ్లో లో ఒక నిరసన ప్రదర్శన ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడినప్పటికీ జపాన్ పొందిన విభాగాలను చైనా తిరిగి పొందలేకపోయింది దీన్ని నిరసిస్తూ మే 4 1919 న చేపట్టిన ఉద్యమాన్ని మే 4 ఉద్యమం అంటారు
ఇందులో లో  ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రజాస్వామ్యం జాతీయవాదం  ద్వారా  ముందుకు వెళ్లాలని విదేశీయులను తరిమివేయాలని పేదరికాన్ని తగ్గించాలని మహిళల పరాధీనత ఆడపిల్లల పాదాల కట్టివేయడం వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.

8."సియావో షిమిన్" అనగానేమి?.

చైనాలో మధ్యతరగతి పట్టణ ప్రజలను సియావో షిమిన్ అంటారు

9.సోవియట్లు అంటే ఏమిటి?

రష్యాలో ఉండే స్థానిక రాష్ట్రాలను సోవియట్ లు అంటారు.
రష్యా విప్లవం కంటే ముందు ఏర్పడిన కార్మిక కర్షక సంఘాలను సోవియట్ లు అంటారు.


10.లాంగ్ మా ర్చ్ అనగానేమి?

చైనాలో కమ్యూనిస్టులు( రెడ్ ఆర్మీ ) 6000 కిలోమీటర్ల సైనిక  కవాతు నిర్వహించడాన్ని లాంగ్ మార్చ్ అంటారు.

11.భూసంస్కరణలు అంటే ఏమిటి?
పెద్దపెద్ద భూస్వాములు నుండి భూమిని సేకరించి పేద ప్రజలకు పంచి పెట్టడాన్ని
భూసంస్కరణలు అంటారు. 

12.వియత్నాం వలస పాలన అను భవం వివరించండి?


13. వియత్నాం భూ సంస్కరణలు తీరు తెలపండి?

వియత్నాంలో 1945 ఆగస్టు లో హోచిమిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిక అవును 25 శాతం తగ్గించారు మారు కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు కౌలుదార్లకు మాఫీ చేశారు వియత్నాం విద్రోహుల భూమిని పంచ సాగారు

భూసంస్కరణల తో  1954లో ఉత్తర వియత్నాం లో కొత్త యుగం మొదలయ్యింది .
భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పేద రైతులకు భూమి పంచిపెట్టారు .
రైతుల కలలు నిజం చేయడంలో లో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది
 కాబట్టి రైతులకు మద్దతు పూర్తిగా ప్రభుత్వాలకు లభించింది.

14 .వియత్నాం ప్రధాన ఎగుమతులు ఏవీ?

వియత్నాం ప్రధాన ఎగుమతులు వరి రబ్బర్ పంటలు

15.వియత్నాం రైతాంగం  సమస్యలు పేర్కొనండి?

వియత్నాం దేశం ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలన కింద దశాబ్దాలపాటు ఉండడంవల్ల సామాన్య రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది .

.భూమి లేకపోవటం .
అధిక కౌలు పరిమాణం ఉండటం .
అధిక వడ్డీ భారం కింద రైతాంగం నలిగిపోవడం వెట్టి కార్మికులుగా చేయడం .
వంటివి వియత్నాం రైతాంగం ఎదుర్కొన్నది

16.వియత్నాం లో జాతీయతావా దం ఎలా విస్తరించింది? వివరించండి?

I .వియత్నాంలోను స్థానికులను నాగరికులుగా చేయడానికి విద్య ఒక మార్గంగా భావించారు .

ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు విద్యార్థులు గుడ్డిగా అనుసరించకుండా కొన్నిసార్లు బహిరంగంగా మౌనంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండేవారు.
 టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాఠాలు బోధించేవారు.
 దేశ భక్తి భావంతో సమాజ ప్రయోజనాల కోసం పోరాడటం విద్యావంతుల విధి అని బోధించేవారు 
20వ శతాబ్దంలో ఆరంభంలో  ఆధునిక విద్య కోసం వియత్నాం విద్యార్థులు జపాన్ కి వెళ్లారు.
 ఫ్రెంచ్ వాళ్లను తరిమివేయడం కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి అంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడం ముఖ్య విధిగా జాతీయ భావంతో పని చేశారు.


17 .ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి?

ఏజెంట్  ఆరెంజ్ అత్యంత విష పదార్థం ఇది ఆకులు రాలి పోయేలా చేసి మొక్కల్ని చంపే విషం

18.నై జీరియా గిరిజన జాతులు ఏవి?

నైజీరియాలో "హౌసా పులానీ " ఈ ప్రజలు ఉత్తర భాగంలో అధికంగా ఉండేవారు అదేవిధంగా  లో ఆగ్నేయ భాగంలో లో" ఈ బో తెగ ""నైరుతి భాగంలో" యరు బా".

19.ఖండాం త ర ఆఫ్రికా వాదం అంటే ఏమిటి?

దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడానికి ఖండాంతర ఆఫ్రికా వాదం అంటారు దీన్ని సాధించడానికి కృషి చేసిన వ్యక్తి  కామెన్ క్రుమా..



20.వియత్నాం నూతన గణతంత్ర వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ల ను పేర్కొనండి?

21.చైనా, వియత్నాం, భారత దేశాలలో ని భూ సంస్కరణలు ను పోల్చండి?

చైనా దేశంలో 1950లో భూసంస్కరణల అమలు పెట్టారు గ్రామాలలో ఉన్న ప్రజలను గుర్తించి భూస్వాముల భూముల స్వాధీనం చేసుకుని పంచడం మొదలుపెట్టారు ప్రాం తీయ స్థాయిలో భూ సంస్కరణల సంఘం కీలక పాత్ర పోషించింది చైనా 43 శాతాన్ని గ్రామీణ ప్రజలు 60 శాతానికి పంచిపెట్టడం లో భూసంస్కరణలు విజయం సాధించాయి.

వియత్నాంలో 1954 తర్వాత భూస్వాముల భూముల స్వాధీనం చేసుకొని భూమి లేని రైతాంగానికి పంచి పెట్టడం జరిగింది రైతుల కలలు నిజం చేయడంలో వియత్నాం ప్రభుత్వం సఫలీకృతం అయింది..

భారతదేశంలో  నెహ్రూ ప్రభుత్వం  3 రకాల   భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది .

1.జమిందారీ వ్యవస్థ .
2కౌలు విధానాల సంస్కరణ.
3. భూ పరిమితి విధానాలు .

దున్నేవాడిదే భూమి  అనే లక్ష్యంతో  భూసంస్కరణలు ప్రారంభించారు అయితే పూర్తిస్థాయిలో భారతదేశంలో భూసంస్కరణలు  అమలు కాలేదు

22.వియత్నాం లో అమెరికా జోక్యం  ఎందుకు చేసుకున్నది?

తమ శత్రువులైన కమ్యూనిస్టుల ప్రాబల్యం వియత్నాంలో పెరుగుతున్నందున ఆందోళన చెంది అమెరికా వియత్నాంలో యుద్ధానికి దిగింది

23.నాపాలం బాంబు అంటే ఏమిటి?

మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబును నాపాలం బాంబు అంటారు.

24.నైజీరియాలో చమురు, పర్యావరణo,రాజకీయాల  ప్రభావాన్ని  తెల్పుము?.

డెల్టాలో 1950లో ఎవరు కనుగొన్నారు చమురుకనుగొన్నారు  డ చ్ సెల్ కంపెనీలు ఆధ్వర్యంలో వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి.
 చమురు వెలికి తీసి తమ లాభాల్లో కొంత సైనిక పాలకులకు అందించాయి.
 సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా యదేచ్ఛగా చమురు వెలికి తీయడం వల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి .
జీవావరణ వ్యవస్థ దెబ్బతిని మడ అడవులు అంతరించాయి. దీంతో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలను (క్యాన్సర్ లాంటి వ్యాధులు)  ఎదుర్కోవలసి వచ్చింది .

💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: